Tollywood: ‘జెట్లీ’ని ఆపారు.. ‘పెద్ది’ని కూడా ఆపుతారా..? నిర్మాత ఏమంటున్నారు..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,668FansLike
57,764FollowersFollow

Tollywood: ప్రేక్షకులకు వినోదం అందించాలంటే చిత్రం ప్రదర్శన కావాలి. ప్రేక్షకాదరణకు నోచుకోవాలంటే ప్రదర్శన జరగాలి. అసలు దర్శక-నిర్మాతలు తీసే సినిమా ప్రదర్శన కావాలంటే ఉండాల్సింది ధియేటర్లు. అక్కడ ప్రదర్శన జరిగితేనే అంతిమ ఫలితాలు, లాభనష్టాలు, ప్రేక్షకాదరణ. ఇప్పుడు సినిమా ప్రదర్శన రూపం మారింది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మాత్రమే ఉంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చేశాయి. సీ సెంటర్లలో కూడా మల్టీప్లెక్సులు ఏర్పాటవుతున్నాయి. అయితే.. సినిమా చూసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. వారిని రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ మధ్య లాభనష్టాల బేరీజు జరుగుతోంది. తెలంగాణలో ఇది ముదురుతోంది.

మే 1న విడుదలైన ‘జెట్లీ’ సినిమాను మల్టీప్లెక్స్ నిషేధించాయి. పర్సంటేజీ విధానంలో మల్టీప్లెక్సులు నడుస్తున్నాయి తమకూ పర్సంటేజీ అయితేనే లాభాలు వస్తాయని సింగిల్ స్క్రీన్ల ఎగ్జిబిటర్లు అంటున్నారు. అలా ఇస్తే తమకు నష్టమని నిర్మాతలు చెప్తున్నారు. హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 23 ధియేటర్లు పర్సంటేజీ విధానంలో అయితేనే దియేటర్లు ఇస్తామని పట్టుబట్టారు. ప్రస్తుతం వివాదం జరుగుతూండగా జెట్లీ విడుదలవడం.. మల్టీ ప్లెక్సుల్లో సినిమా ప్రదర్శన నిషేధించాయి. దాంతో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్ పీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే.. వివాదం జెట్లీతోనే కాదు.. త్వరలో మైత్రీ నుంచి ‘పెద్ది’ రాబోతోంది. దీనికి నెల సమయముంది. సమస్య పరిష్కారంపై ప్రస్తుతం ప్రశ్నలు వస్తున్నాయి.

దీనిపై మైత్రీ సంస్థ సీఈఓ చెర్రికి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘పర్సంటేజీల్లో సినిమా ప్రదర్శన జరగాలనేది సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల డిమాండ్. అలా చేస్తే నిర్మాతలు తమకు ఇబ్బంది అంటున్నారు. మే 1 నుంచి పర్సంటేజీ అయితే ధియేటర్లు ఇస్తామని అన్నారు. దీనిపై చర్చించాలని ఫిల్మ్ చాంబర్ అనుకున్నా సాధ్యంకాలేదు. మే 8న మరోసారి జరిగే సమావేశం కీలకం కానుంది. సమస్య అప్పుడు పరిష్కారమవుతుందని భావిస్తున్నా’మని అన్నారు. పెద్దిపై భారీ అంచనాలు ఉన్నాయి. డిమాండ్ బట్టి ధియేటర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనిపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు పరిష్కారమైతై పెద్దికి అడ్డంకులు లేనట్టే. మరి.. ఆ దిశగా ఇద్దరి మధ్యా పరిష్కారం చూపేది ఎవరు..? పెద్దికి అడ్డంకులు తొలగుతాయా..? చూడాలి.

సినిమా

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

బుచ్చిబాబు క్షమాపణలపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు.. ఆసక్తికర చర్చకు దారితీసిన స్పందన

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన వివాదం నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చేసిన క్షమాపణలపై ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ స్పందించారు. ఈ విషయంపై...

పెద్ది చిత్రానికి మరో కొత్త ఆకర్షణ.. బుధవారం నుంచి ఎక్స్‌టెండెడ్ కట్

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న పెద్ది సినిమాకు ఇప్పుడు మరో ప్రత్యేక ఆకర్షణ జోడించబడుతోంది. చిత్ర బృందం తాజా ప్రకటన ప్రకారం, బుధవారం నుంచి...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని...

రాజకీయం

సేన ప్రస్థానం.. జాతీయ సమైక్యత కోసం: ఢిల్లీలో జనసేన కీలక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. "సేన ప్రస్థానం... జాతీయ...

తుని చిన్నారి ఆచూకీపై పవన్ కళ్యాణ్ ఆందోళన.. గాలింపును వేగవంతం చేయాలని ఆదేశం

కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్ష...

డీఎస్సీ వివాదం.. లోకేశ్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీపై రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, కూటమి...

పైకి సింగిల్‌ సింహం… లోపల డబుల్‌ గేమ్‌?

రాజకీయాల్లో మాటలు ఒకలా, వ్యూహాలు మరోలా ఉండటం కొత్త విషయం కాదు. అయితే "సింహం సింగిల్‌గా వస్తుంది" అనే నినాదాన్ని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేసుకున్న వైసీపీ ఇప్పుడు రాజకీయ వాస్తవాల ముందు...

వెన్నుపోటు ఎవరు చేశారు?.. వైసీపీపై అప్పసాని రాజేష్ విమర్శలు

ఏపీలో ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీపై,  తెలుగుదేశం  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తీవ్ర విమర్శలు చేశారు. ‘రెండేళ్ల నమ్మకం,...

ఎక్కువ చదివినవి

Peddi: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సందడి..! ఆరు రోజులకు కలెక్షన్లు ఎంతంటే..

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈమేరకు ఆరు...

Vijay Devarakonda: ఊరికిచ్చిన హామీని నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: ఇటివల హీరో విజయ్ దేవరకొండ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్ పేటలోని ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. ఈసందర్భంగా ఓ...

వికసిత్ భారత్‌కు నైపుణ్యమే బలం.. ఏపీని టాలెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: నారా లోకేష్

విశాఖపట్నంలో నిర్వహించిన డీజీ 100ఎక్స్ ఏపీ (Digii100x Andhra Pradesh) సదస్సులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, నైపుణ్యం...

నందూస్ వరల్డ్ వివాదం ఏమిటి?.. అసలు కథ ఇదే!

తెలుగు సోషల్ మీడియా ప్రపంచంలో “నందూస్ వరల్డ్” పేరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ నందన, ఆమె భర్త మధు ప్రస్తుతం వీసా వ్యవహారానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. యూట్యూబ్ వీడియోలు,...

ఈడీ దూకుడు.. ఏపీ లిక్కర్ కేసులో కీలక అరెస్టులు, సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ సరఫరా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు వేగం పెంచింది. మద్యం రవాణా, సరఫరా ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో...