సమంత హీరోయిన్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన యశోద సినిమా నవంబర్ 11 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రం నిర్మాత శివలెంకల కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ఈ సినిమా కథ సమంతకి చాలా బాగా నచ్చడంతో కేవలం 45 నిమిషాలు కథ విని ఆమె యశోద సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. డబ్బింగ్ సమయం లో ఆమె తీవ్ర అనారోగ్య సమస్యతో ఉన్నప్పటికీ పక్కన డాక్టర్ ని పక్కన పెట్టుకుని మరి ఆమె డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారని నిర్మాత తెలియజేశారు.
ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ నిర్మాత శివలింకల కృష్ణ ప్రసాద్ చాలా నమ్మకంగా తెలియజేశారు. కరోనా ముందు ఈ సినిమా చర్చలు జరిగాయి. కానీ మధ్యలో కరోనా రావడం వల్ల కరోనా తర్వాత చేద్దాం అనుకున్నాం.
ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలు పెట్టినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమా లోని సమంత పాత్ర అద్భుతం గా ఉంటుందని ఆమె కెరియర్ బెస్ట్ అన్నట్టు అనిపిస్తుంది అంటూ నిర్మాత తెలియజేశారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ను నవంబర్ 11 తారీఖున భారీ ఎత్తున దేశ వ్యాప్తంగా సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.
820457 524665Excellent beat ! I wish to apprentice even though you amend your internet website, how can i subscribe for a blog site? The account aided me a appropriate deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear notion 158238
339851 976237This really is some great data. I expect additional facts like this was distributed across the web today. 955521