కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో కేజీఎఫ్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ తర్వాత చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక స్టార్ హీరోతో చేయబోతున్నాడు అనే విషయం చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా కారణంగా కేజీఎఫ్ 2 ఆలస్యం అవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ తెలుగు సినిమా కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతోంది.
సినిమా ఎప్పుడు ప్రారంభం అయ్యేనో కాని తెలుగు ప్రేక్షకుల్లో గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. మొదట ఎన్టీఆర్తో ఈయన సినిమా ఉంటుందని అన్నారు. ఆ తర్వాత మహేష్బాబుతో ప్రశాంత్ నీల్ చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి కాంబో దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగానే అనుకున్నారు. కాని ఇప్పుడు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యేప్పటి వరకు ప్రశాంత్ నీల్ వెయిట్ చేస్తాడా అనేది అనుమానమే. కనుక ప్రభాస్, ప్రశాంత్ నీల్ల కాంబో గాలి వార్తలు అయ్యి ఉంటాయి. అయితే మహేష్ బాబు లేదా ఎన్టీఆర్లతో ఈయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హీరోతో ఈ హీరోతో అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతోంది.
81572 101667Some actually wonderful info , Gladiola I discovered this. 944057
185734 587820This is such a great post, and was thinking a lot exactly the same myself. Another excellent update. 670143
263393 680718hello!,I really like your writing so much! 477446
120215 747473But wanna comment on couple of common things, The internet site style is perfect, the content material material is really very good : D. 590472