‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా’లో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే నేను ఎన్నికల్లో నిలబడ్డాను. ఓడినా వచ్చే రెండేళ్లూ మా సభ్యుల సంక్షేమం కోసం విష్ణు, అతని ప్యానెల్ సభ్యుల్ని నిద్రపోనివ్వను. ‘మా’ అభివృద్ధి కోసం వాళ్లు చేసే కార్యక్రమాల రిపోర్ట్ కార్డ్ అడుగుతా’.
‘ఎన్నికల్లో గెలిచుంటే నాకంటూ పవర్ ఉండేది.. సమస్యల పరిష్కారానికి త్వరగా కృషి చేసేవాడ్ని. నాకు ఓటు వేసిన వారి కోసం పని చేస్తాను. పోలింగ్ రోజున గొడవలు జరిగాయి. ప్రత్యర్ధి ప్యానెల్ వాళ్లు మాతో గొడవ పడ్డారు. మావాళ్లని మోహన్ బాబు తిట్టారు. అప్పుడే ఆయనతో మాట్లాడాను. ఆయన సారీ కూడా చెప్పారు. హాస్య చతురత ఉన్న ఆయన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలా మంచి వ్యక్తి. డిస్టర్బ్ చేస్తే ఆయనేం చేస్తారో ఆయనకే తెలీదు. ఎన్నకల్లో రాజకీయ నాయకులు భాగమయ్యారు. బీజేపీ కూడా పని చేసింది’ అని అన్నారు.
373617 614395This will probably be an excellent internet site, may possibly you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 219597