‘సాహో’ సినిమాతో ప్రేక్షకులను,అభిమానులను కొంతవరకూ నిరాశపరిచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎన్నో జాగ్రత్తలు తీస్కొని తన 20వ సినిమా చేస్తున్నారు. మొదట ‘జాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ లేదా ‘ఓ డియర్’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన పలు సెట్స్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ సినిమా 2020 లోనా లేక 2021 సమ్మర్లోనా అనే విషయాలపై చాలా రోజులగా చర్చలు నడుస్తున్నాయి. కానీ ఈ చిత్ర టీం సన్నిహిత వర్గాలు చెప్పిన దాని ప్రకారం 2020లోనే ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. అదికూడా దసరా హాలిడేస్ సీజన్లో అక్టోబర్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. ప్రభాస్ అండ్ టీం కూర్చొని మరీ ఈ డేట్ ని ఫిక్స్ చేశారు.
దీంతో ఇక గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ డైరెక్టర్. భారీ సెట్స్ తో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా లొందన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ప్రభాస్ కూడా త్వరగా ఈ సినిమాని ఫినిష్ చేసి నాగ్ అశ్విన్ సినిమా కోసం సిద్దమవుతాడు.