Prabhas : ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు దేనికి అదే అన్నట్లుగా ఉన్నాయి. ఈ నెలలో రాబోతున్న ఆదిపురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూ.550 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ రూపొందిన విషయం తెల్సిందే. ఇదే ఏడాది సలార్ సినిమా ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేసేందుకు గాను పీపుల్స్ మీడియా వారు ఏకంగా రూ.185 కోట్లకు కొనుగోలు చేశారు అనేది టాక్. ఇప్పుడు సలార్ యొక్క తెలుగు థియేట్రికల్ రైట్స్ అంతకు మించి అమ్ముడు పోయే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ సినిమా లో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేశాడు. హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే. సినిమాకు ఉన్న బజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదు. కేజీఎఫ్ 2 మాదిరిగా సలార్ వెయ్యి కోట్లను మించి వసూళ్లు చేస్తుందని ప్రశాంత్ నీల్ నమ్మకంతో కనిపిస్తున్నాడట.