ప్రభాస్ తన 20వ చిత్రంను ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ సగానిపి పైగా పూర్తి అయ్యింది. ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే జూన్ జులై వరకు ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ షురూ అయ్యేది. ఇప్పటికే ప్రభాస్ 21వ చిత్రం సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఖరారు చేసిన విషయం తెల్సిందే. మహానటి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ 21 చిత్రం స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు.
ఈ ఏడాది చివర్లో ప్రభాస్ 21 చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ చిత్రంలో విలన్ పాత్రకు గాను కోలీవుడ్ సినియర్ స్టార్ నటుడు అరవింద్ స్వామిని ఎంపిక చేశారు. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ 21 రూపొందుతోంది. అందుకోసమే అన్ని భాషల నుండి ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన నటీనటుల విషయమై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక పాత్రకు అరవింద్ స్వామి అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంకు నాగ్ అశ్విన్ రావడం అందుకు ఆయనతో మాట్లాడటం కూడా జరిగిందట. ప్రభాస్తో మూవీ అంటే అరవింద్ స్వామి ఎక్కువగా ఆలోచించకుండా స్టోరీ లైన్ విని తన పాత్రకు సంబంధించిన సీన్స్ గురించి తెలుసుకుని ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఎప్పటి నుండో అరవింద్ స్వామికి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఈయన చాలా కాలం తర్వాత ధృవ చిత్రంలో నటించాడు. చరణ్ ను ఢీ కొట్టడంలో అరవింద్ స్వామి సూపర్ హిట్ అయ్యాడు. అందుకే ఈ చిత్రంలో ప్రభాస్కు పోటీగా సరితూగే అరవింద్ స్వామిని ఎంపిక చేశారట.
642290 6406How is the new year going? I hope to read a lot more intriguing posts like last year 332252
269523 721702I located your weblog web site on google and check a couple of of your early posts. Proceed to sustain up the superb operate. I just additional up your RSS feed to my MSN Data Reader. In search of forward to reading extra from you later on! 829297