Switch to English

ఫ్యాను తిరగట్లేదు: ఘనత జగన్‌ది, నేరం మోడీది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత చాలా తీవ్రంగా వుందన్నది గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ సర్కార్ చెబుతున్న మాట. అసలు, బొగ్గు కొరత అన్న ప్రశ్నే తలెత్తబోదని కేంద్రం చెబుతోంది. తూచ్, బొగ్గు కొరత వల్లనే దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందనీ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందనీ ఏపీ ప్రభుత్వం అంటోంది.

కాగా, కేంద్రం వద్ద వున్న మిగులు విద్యుత్ వాడుకోవాలనీ, అవసరమైన మేర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా కూడా చేస్తున్నామనీ కేంద్రం సవివరంగా పేర్కొంటోంది. ఇంతకీ, తప్పెవరిది.? తెలంగాణకు లేని విద్యుత్ సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు వచ్చింది.? విద్యుత్ వాడకం తగ్గించాలనీ, ఇందుకోసం ఏసీలు ఓ నిర్ణీత సమయంలో ఆపేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమేంటి.?

‘తెలంగాణకి బొగ్గు సమస్య లేదు.. విద్యుత్ సంక్షోభం అసలే లేదు..’ అని తెలంగాణ ప్రభుత్వం కుండబద్దలుగొట్టేస్తోంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం.. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లెక్కలివీ.. డిమాండ్ లెక్కలివీ.. అంటూ కాకమ్మ కబుర్లు చెబుతుండడం గమనార్హం.

ఔను, రాష్ట్రంలో కొన్ని చోట్ల ఫ్యాన్ తిరగడంలేదు.. లైటు వెలగడంలేదు.. అంతా కరెంటు కోతల ఫలితమే. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చామనీ, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామనీ.. ఇప్పటిదాకా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చింది అధికార వైసీపీ. ఏదీ, ఎక్కడ.? ఆ ‘ఫలాలు’ ఎవరికి అందుతున్నాయ్.? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడిప్పుడు.

జగనన్న కొవ్వొత్తుల పథకం పేరుతో.. ఇంటింటికీ ముందు ముందు పదో పాతికో కొవ్వొత్తులు అందించినా ఆశ్చర్యపోనక్కర్లేదు కరెంటు కోతల పుణ్యమా అని. సోషల్ మీడియాలో ఇలాంటి మీమ్స్ పెద్దయెత్తున సందడి చేస్తున్నాయి.

ఇప్పుడిది వర్షాకాలం.. రాబోయేది శీతాకాలం.. ఆ తర్వాత వేసవి వచ్చిందంటే.. పరిస్థితి ఇంకెలా వుండబోతోందో తలచుకుంటేనే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెమటలు పట్టేస్తున్నాయ్. ఏం ఫర్లేదు.. సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికార పార్టీ చెబుతోంది. పబ్లిసిటీ తగ్గించుకుని.. పని మీద అధికార పార్టీ ఫోకస్ పెట్టాలంటూ సెటైర్లు పడుతున్నాయంటే.. ముందు ముందు రాజకీయంగా ఫ్యాన్ తిరగని పరిస్థితి రాష్ట్రంలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మొత్తమ్మీద, సమస్య వచ్చినప్పుడు నెపాన్ని ఇతరుల మీద నెట్టేయడంలో జగన్ సర్కార తన ప్రత్యేకతను ఇంకోసారి ఘనంగా చాటుకుంటోంది. ‘మా తప్పు ఏమున్నదబ్బా.?’ అంటూ పాపం మొత్తాన్నీ కేంద్రం మీద నెట్టేసేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది....

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

ఇన్‌స్టా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. అంటున్న ఐకాన్‌స్టార్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

వైనాట్ 175 అటకెక్కింది.! ఓన్లీ పిఠాపురం చుట్టూ వైసీపీ గింగరాలు తిరుగుతోంది.!

అదేంటీ, వైనాట్ 175 అన్నారు కదా.. ఇప్పుడేంటి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ అంతా, పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరగడం.? ఔను, వైసీపీ అధినాయకత్వం పూర్తిగా పిఠాపురం మీదనే...

Ustaad Bhagat Singh : గ్లాస్ డైలాగ్‌ ని బలవంతంగా చెప్పించాడు : పవన్‌

Ustaad Bhagat Singh : పవన్‌ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉస్తాద్‌ భగత్ సింగ్ టీజర్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ లో పవన్ కళ్యాణ్‌...