జగన్ ను మర్డర్ చేయించొద్దు.. దయచేసి ఆయన్ను బతకనీయండి.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు నటుడు, వైసీపీలో కీలకంగా ఉన్న నేత ఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని క్రిష్ణ మురళి. ఆయన ప్రస్తుతం చేసిన ఈ కామెంట్లు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పుడు ఏపీలో తిరుపతి లడ్డూ కల్తీ మీద తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా కాలంగా బయటకు రాని పోసాని కృష్ణమురళి మరోసారి మీడియా ముందుకు వచ్చాడు. వస్తూనే ఏపీ కూటమి ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశాడు. తిరుపతి లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడు అని చెప్పారు. ఇక జగన్ ను తిరుమలకు వెళ్లకుండా ఆపడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జగన్ కు ప్రాణహాని ఉందని సంచలన కామెంట్లు చేశాడు. జగన్ ను మర్డర్ చేయొద్దని.. బతకనీయండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా జగన్ కు ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. ఇలా వరుసగా వైసీపీ నేతలు జగన్ ను చంపేస్తారని ప్రచారం చేయడం వెనక మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు.
ప్రస్తుతం అధికారంలో మూడు పార్టీలు ఉంటే.. ప్రతిపక్షంలో జగన్ ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆయనకు సింపతీని క్రియేట్ చేసేందుకు.. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలన్నీ పక్కకు పోయే విధంగా మూకుమ్మడిగా జగన్ ప్రాణహాని ఆరోపణలు తెరమీదకు తెస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని కూడా అంటున్నారు.
