తొమ్మిది ముఖ్యమైన అంశాలు.. దాదాపు 30 పేజీలతో కూడిన పుస్తకం.. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై జనసేన పార్టీ నివేదిక సారాంశం. వైద్య ఆరోగ్య రంగం, జల వనరుల శాఖ, ఉద్దానం కిడ్నీ సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి.. ఇలా ఒకటేమిటి.? దాదాపు అన్ని అంశాలపైనా ఈ నివేదికలో జనసేన పార్టీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేసింది.
రాజధాని అమరావతిపై సందిగ్ధ పరిస్థితుల్ని కల్పించడం, పోలవరం ప్రాజెక్టుని గాలికొదిలేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని జనసేనాని నిలదీశారు. దేశం ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లుతున్న వేళ, విభజన గాయంతో ఇప్పటికీ కోలుకోలేకపోతున్న రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల పేరుతో ఏం చేయదలచుకుంటున్నారు.? అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. డబ్బుల్లేని రాష్ట్రాన్ని మరింత దివాళా తీసేలా ప్రభుత్వ చర్యలున్నాయనీ, పెట్టుబడిదారులు పారిపోతున్నారనీ, శాంతి భద్రతలు అదుపు తప్పేశాయనీ.. ఇలా చాలా ఆరోపణల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేశారు. ఆ ఆరోపణలపై అధికార పక్షం నుంచి సమాధానం పేరుతో ఎదురుదాడి ఎలాగూ జరుగుతుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, 100 రోజుల జగన్ పాలనపై జనసేన పార్టీ ఆలోచనా విధానం ఎలా వుంది.? జనసేన తన నివేదికలో చెప్పింది నిజమా.? కాదా.? ఒపీనియన్ పోల్లో మీ అభిప్రాయం పంచుకోండి.
[poll id=”9″]
239256 698147hello!,I genuinely like your writing very a lot! percentage we maintain up a correspondence extra about your article on AOL? I want an expert on this region to unravel my difficulty. May be that is you! Taking a appear forward to peer you. 16668
555352 494373Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory utilizing that your is also fighting that is actually a result from our team rrnside the twenty initial centuries. everyday deal livingsocial discount baltimore washington 239460