Switch to English

హతవిధీ: అటు రాజకీయం.. ఇటు సోషల్ మీడియా పైత్యం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

సంక్షోభాల నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెబుతుంటారు. ఇది నూటికి నూరు శాతం కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్ లో దీనిని రాజకీయాలకూ అన్వయంచడమే దురదృష్టకరం. కరోనా వంటి విపత్కర సమయంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలూ చోటుచేసుకున్నాయి. తాజాగా విశాఖ విషవాయువు సందర్భంగానూ ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.

భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి పీడకలను గుర్తుకుతెచ్చేలా జరిగిన ఈ సంఘటన విశాఖ ప్రజల్లోనే కాకుండా అందరినీ భయాందోళనలకు గురిచేస్తుండగా.. పార్టీలు మాత్రం రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా శోచనీయం. ఓ వైపు విశాఖలో పరిస్థితులు ఘోరంగా ఉండగా.. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార పార్టీ ఆరోపణలు ప్రారంభించారు.

విశాఖకు రాజధాని తరలింపు ఇష్టం లేకపోవడం వల్ల, ఆ ప్రాంతం సురక్షితం కాదని నిరూపించేందుకు ఇలాంటి కుట్రకు తెగబడి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఆరోపణలు ఎంతమాత్రం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక రాజకీయాలు ఇలా సాగుతుండగా.. సోషల్ మీడియాలో పైత్యం మరీ ఎక్కువైపోయింది. అధికార, విపక్షాలకు చెందిన సోషల్ మీడియా సైన్యం ఒకరిపై మరొకరు దారుణమైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా అంటేనే అనుచిత పోస్టులు, మార్ఫ్ డ్ ఫొటోలు ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా విశాఖ విషవాయువు ఘటనను కూడా ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టడానికి వినియోగిస్తున్నారు. అమరావతి రాజధానిగా ఉండకుండా కుట్ర పన్నిన వైజాగ్ వాసులకు ఇలాగే కావాలంటూ కొన్ని పోస్టులు చక్కర్లు కొట్టాయి.

అయితే, అదంతా కుట్ర అని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ స్పష్టంచేశారు. అది మార్ఫ్ డ్ పోస్టని పేర్కొన్నారు. ఆ ట్విట్టర్ అకౌంట్ నేమ్ లో 15 అక్షరాలకు మించి ఉండటమే ఇందుకు నిదర్శనమని.. ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేమ్ 15 అక్షరాలకు మించి ఉండదనే విషయం కూడా ఆ పేటీఎం బ్యాచ్ కు తెలియదని ఎద్దేశా చేశారు.

మొత్తానికి విషాద సమయంలోనూ అటు రాజకీయంగానూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం మంచిది కాదని పలువురు పేర్కొంటున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...