ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా దేశం యావత్తూ ఘన నివాళులు అర్పిస్తోందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఆయన నేషనల్ ఐకాన్ అని.. ఆయన ఆశయాలు, త్యాగాలు భారతీయులకు స్ఫూర్తి అని కొనియాడారు.
సుభాష్ చంద్రబోస్ జాతీయవాదం, దూరదృష్టి కలిగిన గొప్ప దేశభక్తుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బోస్ అసమాన ధైర్యం, నిస్వార్ధ దేశ సేవకు గుర్తుగా ఆయన జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్నామని అన్నారు.
దేశానికి నేతాజీ అందించిన సేవలను భారతీయులు మరువలేరు. సుభాష్ చంద్రబోస్ కు నా నివాళులు అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
గణతంత్ర దినోత్సవాల్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని తొలిసారిగా ఈ ఏడాది చేర్చారు. దీంతో రిపబ్లిక్ డే దినోత్సవాలను జనవరి 24కు బదులుగా 23 నుంచే ప్రారంభించేలా కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఈరోజు ప్రధాని ఆవిష్కరించనున్నారు.
156167 743101Some truly good and valuable information on this site, likewise I conceive the style holds exceptional capabilities. 765025
245243 216029There is noticeably a great deal of dollars to understand about this. I assume youve made certain nice points in features also. 696737