కరోనా అనే మహమ్మారి వలన ప్రపంచం స్తంభించిపోయింది. ఇండియా మొత్తం లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే లాక్ అయ్యారు. ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసే సినీ పరిశ్రమ కూడానా అన్నీ బంద్ చేసుకుని ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. షూటింగ్స్ లేక డైలీ లేబర్, జూనియర్ ఆర్టిస్టులు మరియు సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.
అలాంటి వారిని ఆదుకోవడం కోసం పలువురు ఇండస్ట్రీ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దగా కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించారు. ఇప్పటికే సెలబ్రిటీలు అంతా ఇస్తున్న విరాళాలను అవసరమైన రూపంలో అందరికీ అందేలా చూస్తున్నారు. అంతే కాకుండా ఈ క్వారంటైన్ సమయంలో ఇంటి నుంచి బయటకి రాకుండా చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కోటి కలిసి ప్రజలలో కరోనా పై అవగాహన పెంచడానికి ఓ సాంగ్ ని కూడా చేశారు.
ఈ సాంగ్ కి అందరి నుంచీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సాంగ్ అటు తిరిగి ఇటు తిరిగి ప్రధాని మోదీజీకి చేరింది. అది చుసిన మోడీ ప్రతి ఒక్కరినీ పేరు పేరునా మెచ్చుకున్నారు. ‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.’ అని మోడీ తన ట్విట్టర్ ద్వారా చిరు, నాగ్ లకి అభినందనలు తెలిపారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020
844019 187254Hi there! I just want to give a huge thumbs up for the good data you could have correct here on this post. I will likely be coming once again to your weblog for more soon. 656939
689280 163130Read more on that great Post, I linked to you Thanks. 861739
692236 292898I dont usually comment but I gotta say thankyou for the post on this remarkable one : D. 15515