రాజకీయాలకి స్వస్తి చెప్పి పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బాలన్స్ చేయాలనీ డిసైడ్ అయ్యి, రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న మొదటి సినిమా ‘వకీల్ సాబ్’.
దాదాపు 75% షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాని ముందుగా మే 15న రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేశారు. కానీ కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విరుచుకుపడడంతో ప్రపంచం అంతా లాక్ డౌన్ నడుస్తోంది. దాంతో షూటింగ్స్ ఆగిపోయాయి, లాక్ డౌన్ కూడా ఏప్రిల్ 14తో పూర్తవ్వకుండా పొడిగించే అవకాశమే కనపడుతోంది. దీని ప్రకారం అన్నీ సెట్ అయితే మే లో లాక్ డౌన్ ఎత్తివేస్తే షూటింగ్ మొదలవ్వచ్చు లేదా ఇంకా లేట్ అవ్వచ్చు.
దాంతో ఈ చిత్ర టీం సినిమాని 3 నెలలు వెనక్కి వేసి ఆగష్టులో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అది కూడా మెగాస్టార్ చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న లేదా ఒక రోజు ముందుగా ఆగష్టు 21న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కరోనా కనీసం మే కన్నా తన అవతారం చాలిస్తే జూన్ లో షూట్ ఫినిష్ చేసి ఆగష్టు లో పక్కాగా రిలీజ్ చేస్తారు.
పవన్ కళ్యాణ్ సరసన మూడవ సారి శృతి హాసన్ జోడీ కడుతున్న ఈ సినిమాలో అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు – బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
72992 194137Spot on with this write-up, I actually suppose this internet site needs significantly more consideration. probably be once a lot more to learn way a lot more, thanks for that information. 81921
255554 210006Outstanding post, I feel weblog owners ought to larn a great deal from this site its rattling user friendly . 801873
362917 736610i could only wish that solar panels cost only several hundred dollars, i would really like to fill my roof with solar panels- 97958