Switch to English

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,923FansLike
57,764FollowersFollow

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.! కుప్పంలో కొడతాం.. అని వైసీపీ నినదిస్తే.. పులివెందులలో కొట్టి చూపించారు పట్టభద్రులు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమ వైఫల్యాల్ని అంగీకరించి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. అధికార పార్టీకి అది చాలా చాలా అవసరం. కానీ, అధికార వైసీపీ చిత్రమైన వాదనని తెరపైకి తెచ్చింది. ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటోంది వైసీపీ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇంకా చాలామంది వైసీపీ నేతలు ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు.

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పేర్ని నాని ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నవ్వులపాలవుతున్నాయి కూడా.! ప్రజల్లోంచే పట్టభద్రులు వస్తారన్న కనీసపాటి ఇంగితం లేని పేర్ని నాని, మంత్రిగా పని చేయడం.. నిజంగానే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆ మధ్య ‘వారాహి’ వాహనానికి సంబంధించిన రంగుని రవాణా శాఖ అనుమతించదని, గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని సెలవిచ్చారు. ఇప్పుడేమో, ‘అలాగని ఎవరన్నారు..’ అంటూ బుకాయిస్తున్నారు. ఇదీ వైసీపీ సిద్ధాంతం.! ఇక్కడ ఇంతే. గెలుపు వైసీపీ ఖాతాలో.. ఓడిపోతే, అస్సలు సంబంధం వుండదు వైసీపీకి.! పట్టభద్రుల్లోనే ఇంతటి వ్యతిరేకత అధికార పార్టీ మీద వుందంటే, ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

అందునా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పట్టభద్రులు, వైసీపీని ఛీ కొట్టడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో.. వైసీపీకి పట్టభద్రులు చుక్కలు చూపించిన వైనం.. అధికార పార్టీకి చెంప పెట్టు. న్యాయ రాజధాని లేదు.. కార్య నిర్వాహక రాజధాని అసలే లేదు. వైసీపీ మూడు రాజధానుల నినాదం అట్టర్ ఫ్లాప్ అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయింది. అందుకే, అసలు పట్టభద్రులంటే ప్రజలే కాదన్న వింత వాదనని వైసీపీ తెరపైకి తెచ్చింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, అసలు ప్రజలు ఓటర్లే కాదని వైసీపీ నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ఏడో తరగతి ఫెయిలయినోళ్ళతోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేయించిన వైసీపీ, ఎలా చావు దెబ్బ తినేసిందబ్బా.? అంటే, కొనుక్కొచ్చిన ఓటర్లు కూడా వైసీపీకి షాక్ ఇచ్చారన్నమాట.

14 COMMENTS

సినిమా

100 కోట్ల తండేల్..!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా...

తమిళ ఇండస్ట్రీ 1000 కోట్లు.. మలయాళం 700 కోట్లు..!

సినిమా క్వాలిటీని పెంచే క్రమంలో.. ఆడియన్స్ కు విజువల్ ట్రీట్ అందించాలని సినిమా బడ్జెట్ ని రెండు మూడింతలు పెంచేస్తున్నారు మేకర్స్. స్టార్ సినిమా, వందల...

అనుదీప్ ఫంకీ హీరోయిన్ ఛాన్స్ ఎవరికి..?

జాతిరత్నాలు అనుదీప్ ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత సైలెంట్ గా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీసి వదిలాడు. ఆ...

300 ఏళ్ల నాటి కథతో సూర్యని మెప్పించారా..?

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి రీసెంట్ గా నాగ చైతన్యతో తండేల్ సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్...

యువ హీరో జాగ్రత్త పడకపోతే కష్టమే..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ రిస్క్ లో ఉందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అనతికాలంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి...

రాజకీయం

పవన్ కళ్యాణ్ ‘తలసీమియా’ సాయంపైనా విమర్శలా.? సిగ్గు సిగ్గు.!

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ విరాళం ఇవ్వొచ్చు కదా.? మ్యూజికల్ ఈవెంట్‌లో ఎంజాయ్ చేసి, విరాళం పేరుతో పవన్ కళ్యాణ్ డ్రామా ఆడుతున్నారు.! చంద్రబాబు మెప్పు కోసమే ఎన్టీయార్ ట్రస్ట్ ఈవెంట్‌కి...

తమిళనాడు, కేరళల్లో పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్ర సూపర్ హిట్.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్ని గత కొద్ది రోజులుగా సందర్శించి, ఈ రోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. సనాతన ధర్మ...

పాపం వైసీపీ.! చంద్రబాబు – పవన్ కలయికతో ఏడుపొక్కటే తక్కువ.!

ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఆన్సర్’ చేయలేదట. చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి, దేవాలయాల సందర్శన కార్యక్రమం...

తలసీమియా బాధితుల సహాయార్థం ఎన్టీయార్ ట్రస్ట్‌కి పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల విరాళం.!

సినీ నటుడు, పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సాయం చేయడంలో ముందుంటారు. విజయవాడ వరదల నేపథ్యంలో కనీ వినీ ఎరుగని రీతిలో కోట్లాది...

బాబు ఆలోచన.. భువనేశ్వరి ఆచరణ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్ట్.. నారా లోకేష్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణ కలిపి ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ...

ఎక్కువ చదివినవి

Whale: సముద్రంలో యువకుడ్ని నోట కరచి.. ఆపై వదిలేసిన తిమింగలం.. వీడియో వైరల్

Whale: సముద్రంలోకి ఓ చిన్న పడవలో తండ్రితో కలిసి వెళ్లిన యువకుడ్ని తిమింగలం నోట కరచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంత వైరల్ అవడానికి మరో కారణం...

సనాతన ధర్మ యాత్రకు బయలుదేరిన పవన్ కళ్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర చేపట్టారు. ఇందుకోసం ఆయన ఈరోజు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి కొచ్చి బయలుదేరారు. హైందవ ధర్మ పరిరక్షణ...

బోయపాటితో నాగ చైతన్య..?

తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య టైర్ 2 హీరోల్లో టాప్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. వీకెండ్ వరకే కాదు సోమవారం కూడా తండేల్ కలెక్షన్స్ అదిరిపోయినట్టు తెలుస్తుంది....

Kingdom : రౌడీస్టార్‌ ‘కింగ్డమ్’.. అంచనాలు పెంచిన టీజర్‌

Kingdom : రౌడీస్టార్‌ విజయ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. 'VD12' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకి...

బాబు ఆలోచన.. భువనేశ్వరి ఆచరణ స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ట్రస్ట్.. నారా లోకేష్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణ కలిపి ఎన్టీఆర్ ట్రస్ట్ అని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ...