Switch to English

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.! కుప్పంలో కొడతాం.. అని వైసీపీ నినదిస్తే.. పులివెందులలో కొట్టి చూపించారు పట్టభద్రులు. ఇలాంటి పరిస్థితుల్లోనే తమ వైఫల్యాల్ని అంగీకరించి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుంది. అధికార పార్టీకి అది చాలా చాలా అవసరం. కానీ, అధికార వైసీపీ చిత్రమైన వాదనని తెరపైకి తెచ్చింది. ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటోంది వైసీపీ. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇంకా చాలామంది వైసీపీ నేతలు ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు.

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో పేర్ని నాని ‘పట్టభద్రులు వేరు.. ప్రజలు వేరు..’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నవ్వులపాలవుతున్నాయి కూడా.! ప్రజల్లోంచే పట్టభద్రులు వస్తారన్న కనీసపాటి ఇంగితం లేని పేర్ని నాని, మంత్రిగా పని చేయడం.. నిజంగానే రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆ మధ్య ‘వారాహి’ వాహనానికి సంబంధించిన రంగుని రవాణా శాఖ అనుమతించదని, గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని సెలవిచ్చారు. ఇప్పుడేమో, ‘అలాగని ఎవరన్నారు..’ అంటూ బుకాయిస్తున్నారు. ఇదీ వైసీపీ సిద్ధాంతం.! ఇక్కడ ఇంతే. గెలుపు వైసీపీ ఖాతాలో.. ఓడిపోతే, అస్సలు సంబంధం వుండదు వైసీపీకి.! పట్టభద్రుల్లోనే ఇంతటి వ్యతిరేకత అధికార పార్టీ మీద వుందంటే, ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.

అందునా, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పట్టభద్రులు, వైసీపీని ఛీ కొట్టడం.. అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో.. వైసీపీకి పట్టభద్రులు చుక్కలు చూపించిన వైనం.. అధికార పార్టీకి చెంప పెట్టు. న్యాయ రాజధాని లేదు.. కార్య నిర్వాహక రాజధాని అసలే లేదు. వైసీపీ మూడు రాజధానుల నినాదం అట్టర్ ఫ్లాప్ అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయింది. అందుకే, అసలు పట్టభద్రులంటే ప్రజలే కాదన్న వింత వాదనని వైసీపీ తెరపైకి తెచ్చింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే, అసలు ప్రజలు ఓటర్లే కాదని వైసీపీ నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ఏడో తరగతి ఫెయిలయినోళ్ళతోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేయించిన వైసీపీ, ఎలా చావు దెబ్బ తినేసిందబ్బా.? అంటే, కొనుక్కొచ్చిన ఓటర్లు కూడా వైసీపీకి షాక్ ఇచ్చారన్నమాట.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...