రాజకీయమంటే ప్రజా సేవ.. కానీ, వైసీపీ దృష్టిలో రాజకీయమంటే, మనుషుల్ని చంపడం. ‘రప్పా రప్పా’ నరకడం గురించి ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ కార్యకర్తల్ని వెనకేసుకొచ్చిన వైనం అందరికీ తెలిసిందే.
తాజాగా, వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ‘మన ప్రభుత్వం వచ్చాక..’ ఏం చేయాలన్నదానిపై, కార్యకర్తలకు హితోపదేశం చేశారు. ‘చికట్లో కన్ను కొడితే పనైపోవాలట.. రప్పా రప్పా నరుకుతాం.. అని నినాదాలు చేస్తే సరిపోదు. అరిచే కుక్క కరవదు. నరికెయ్యాలి.. ఆ తర్వాత పరామర్శకి వెళ్ళాలి..’ అంటూ కార్యకర్తలకు సూచించారు మాజీ మంత్రి పేర్ని నాని.
కుమారుడికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చేందుకోసం, గత ఎన్నికల్లో పేర్ని నాని పోటీ కూడా చేయలేదు. కానీ, పేర్ని నాని చేసిన రాజకీయ పాపాలు, అతని కుమారుడి ఓటమికి కారణమయ్యాయి. వైసీపీ దారుణ పరాజయంలో, జగన్ పాలేరు అయిన పేర్ని నాని పాత్ర కూడా తక్కువేమీ కాదు. మంత్రిగా తన శాఖల వ్యవహారాలు పక్కన పెట్టి, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేశారాయన.
కొడుకు ఓటమితో, పార్టీ ఓటమితో కూడా పేర్ని నాని వైఖరిలో మార్పు రాలేదు. యధా అథినేత, తథా పేర్ని నాని.. అన్నట్లు తయారైంది వ్యవహారం. పైగా, ఇప్పుడు ‘రాజకీయ ప్రత్యర్థుల్ని చంపెయ్యాలంటూ’ పిలుపునిస్తున్నారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలట.. అంటే, ఏ స్థాయికి వైసీపీ రాక్షసత్వం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
పేర్ని నాని వ్యాఖ్యల నేపథ్యంలో, ‘గతంలో వైఎస్ వివేకానంద రెడ్డిని ఇలానే కన్ను కొట్టి నరికేశారా.?’ అన్న ప్రవ్నలు వైసీపీ మీదకు దూసుకొస్తున్నాయి.
అయినా, ఇంతలా ‘చంపేస్తాం.. నరికేస్తాం..’ అని బెదిరింపులకు దిగుతున్న నాయకుల్ని, రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎలా ఉపేక్షిస్తోంది.? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది.? కూటమి పార్టీలు ఎందుకు, తగిన చర్యలు తీసుకోవడంలేదు వైసీపీ మీద.?
శవాలతో రాజకీయం వైసీపీకి కొత్త కాదు.! అందర్నీ చంపేసి, స్మశానాల్లో ఓట్లు అడుక్కోవడానికీ వైసీపీ సిగ్గుపడదు.
