చిరంజీవి అంటే సీఎం జగన్కు ఎంతో గౌరవమని, ఆయనను సోదరభావంతో చూస్తారని.. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదిశగా చొరవ చూపాలని మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టొరీ సినిమా వేడుకలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సినీ ప్రముఖలతో భేటీ అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి ఈ సమావేశంలో సినీ ప్రముఖులకు వివరించాం. త్వరలోనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఏపీ ప్రజలకు వినోదాన్ని పంచుతాం. “సినిమాపై మాకున్న ఆపేక్షను ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారు” అని ప్రజలెవరూ ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడిన టికెట్ రేట్లను అమలు చేస్తాం. ప్రభుత్వ నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది. ఇందుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది. చట్టాలకు అతీతంగా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉత్పన్నం కాదని అనుకుంటున్నా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులు కూడా.. “ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది” అంటూ అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలంగా స్పందించాం. ఈ రోజు జరిగిన సమావేశంలో బెనిఫిట్ షోల గురించి ఒక్కరు కూడా అడగలేదు’ అని అన్నారు.
నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో 1800 థియేటర్లు ఉంటే.. ఇప్పుడా సంఖ్య 1200లకు పడిపోయింది. వాటిలో 500-600 థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. ఆ థియేటర్లను పవర్ టారిఫ్ సమస్య వేధిస్తోంది. శాలరీలు, డిజిల్ ఛార్జీలు పెరిగాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చాం. ఇందుకు ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సానుకూలంగా స్పందించారు. మాజీ సీఎం రాజశేఖర్రెడ్డి చిత్ర పరిశ్రమకు చేసిన సాయం మాదిరిగానే.. జగన్ ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. మరోసారి సినీ ప్రముఖులతో భేటీ అయి, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రస్తుతం థియేటర్లన్నీ ఎయిర్ కండీషన్ ఉండటంతో థియేటర్ ప్రాపర్టీ విలువ పెరిగింది. థియేటర్ సెక్టార్ బతికించుకుంటే మిగిలిన వ్యవస్థలో అందరూ బతుకుతారు’’ అని అన్నారు.
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సినీ సమస్యలపై తమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కొత్త సినిమాల విడుదల సమయంలో బెనిఫిట్ షో కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే తప్పకుండా అనుమతి ఇస్తుంది. గతం మాదిరిగానే త్వరలోనే ఏపీలో షూటింగ్లు మొదలు పెడతాం. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ కావాలని మేమే ఆడిగాం’ అని అన్నారు.
660958 756765This is the proper weblog for anybody who hopes to learn about this topic. You know a complete lot its almost tough to argue along (not that I truly would wantHaHa). You undoubtedly put a whole new spin for a subject thats been written about for years. Fantastic stuff, just amazing! 226922