People media factory: దాదాపు 20ఏళ్ల క్రితం తెలుగులో వరుస సినిమాలు చేసిన హీరో సిద్ధార్ధ్ (Siddarth) నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినా హిట్లు అందుకోలేకపోయారు. 2021లో తెలుగులో అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వంలో మహా సముద్రం సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు సిద్ధార్ధ్ కు టాలీవుడ్ ప్రసిద్ధ నిర్మాణ సంస్ధ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) బ్రేక్ ఇవ్వబోతుందనే చెప్పాలి.
వరుసగా హిట్ సినిమాలతో, మంచి కంటెంట్ ఉన్న కథలతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇటివల పేరు తెచ్చుకుంది. ఈక్రమంలో టక్కర్ సినిమా కంటెంట్ పై నమ్మకంతో ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు సంస్థ నిర్మాతలు టీ.జీ.విశ్వప్రసాద్, వివేక్. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈనెల 9వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాపై సిద్ధార్ద్ నమ్మకంగా ఉన్నారు. కార్తీక్ జి.గిరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యాంశు కౌశిక్ నటిస్తోంది.