తెలుగుదేశం పార్టీ 1982 లో నందమూరి తారకరామారావు స్థాపించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీ ఆగడాలు చూసి తట్టుకోలేక, తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తరువాత 9 నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ తరువాత ఏం జరిగింది అనే విషయం అందరికి తెలిసిందే. ఒకవైపు సినిమా రంగంలో ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో ఉంటూ అన్ని రకాలుగా పార్టీని నడిపించారు. ప్రజారంజక పాలన చేశారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నాక ఆ పార్టీకి మరింత హైప్ తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు, హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ కు పరిచయం చేయడమే కాకుండా, హైటెక్ సిటీ నిర్మాణం జరగడానికి కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.
అయితే, ఇప్పుడు బాబు పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించలేకపోతున్నారు. ఒంటరిగా పోరాటం చేయలేకపోతున్నారు. చరిష్మ కలిగిన నేతలు బాబు వెనక ఎవరూ లేరు. దీంతో బాబుకు అడుగడుగా అడ్డంకులు ఎదురౌతున్నాయి. తాజాగా విశాఖలో బాబుకు ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెలిసిందే.
చంద్రబాబు పై వైకాపా నేతలు ఎలాంటి విమర్శలు చేస్తారో అందరికి తెలిసిందే. ఈ కోవలోనే ఇప్పుడు మరోనేత చేరిపోయారు. అయనే మంత్రి పెద్దిరెడ్డి. ఈరోజు విశాఖలో బాబు పర్యటనను అయన విమర్శించారు. బాబు నాయకుడు ఎంతమాత్రం కాదని, నాయకుడు అంటే రామారావు అని, రామారావుతో పాటే పార్టీ కూడా చచ్చిపోయిందని, ఇప్పుడు బాబు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారని విమర్శించారు. పెద్ది రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
875290 214471Some genuinely superb information , Sword lily I identified this. 998896
939932 436863Quite informative and amazing bodily structure of content material material , now thats user friendly (:. 626494