వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,039FansLike
57,764FollowersFollow

పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండానే పవన్ కళ్యాణ్ ‘జయ కేతనం’ ప్రసంగాన్ని ముగించారు.

సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పిఠాపురంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ ‘జయకేతనం’ బహిరంగ సభని కానుకగా జనసేనాని ఇచ్చారన్న చర్చ, స్థానికంగా జరిగింది. ‘పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో జగన్ పేరు ప్రస్తావించకపోవడమే మంచిది’ అని చాలామంది జనసైనికులు కోరుకున్నారు.

అయితే, ‘కార్పొరేటర్‌కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ’ అంటూ ఇటీవల వైఎస్ జగన్ చేసిన కామెంట్ల నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో కౌంటర్ ఎటాక్ ఇస్తారని అంతా అనుకున్నారు.

వైసీపీ ప్రస్తావన ఒకట్రెండు సందర్భాల్లోనే, అదీ పరోక్షంగా తీసుకొచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్ ‘జయకేతనం’ బహిరంగ సభలో. మనది 11వ ఆవిర్భావ దినోత్సవం.. అందుకే, వాళ్ళకి 11 సీట్లకు పరిమితం చేశాం.. అని పవన్ కళ్యాణ్ చమత్కరించారు ఓ సందర్భంలో.
తిట్టారు, తూలనాడారు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమన్నారు.. కానీ, బద్దలుగొట్టాం కదా.. అని ఇంకో సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. స్పష్టంగా, రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకున్నారు, ఆ సందేశానికే పరిమితమయ్యారాయన.

మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబు, ఎంపీ బాలశౌరి తదితరులు, తమ ప్రసంగాల్లో వైసీపీని ప్రస్తావించారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరునీ కొందరు ప్రస్తావించారు. ‘నీ తండ్రి ముఖ్యమంత్రి అయి వుండకపోతే, నువ్వు కౌన్సిలర్ అయినా అయి వుండేవాడివా.?’ అని జగన్‌ని సూటిగా ప్రశ్నించారు మంత్రి కందుల దుర్గేష్.

అంతే తప్ప, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అసలంటూ జగన్ పేరుని ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. ‘ఆ స్థాయి అతనికి లేదు’ అని బహుశా పవన్ కళ్యాణ్ అనుకుని వుండొచ్చు.

భవిష్యత్ లక్ష్యాలు పెద్దవిగా పెట్టుకున్నట్లు చెప్పిన జనసేనాని, వైసీపీ అనే రాజకీయ పార్టీని కాలగర్భంలో తొక్కేశానన్న భావనలో వున్నారేమోనని జనసైనికులు చర్చించుకోవడం జరిగింది జయకేతనం బహిరంగ సభలో.

మీడియా, రాజకీయ వర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి చర్చే జరుగుతోంది. ‘పవన్ కళ్యాణ్ చేసింది ముమ్మాటికీ కరెక్టే. తన స్థాయిని పవన్ కళ్యాణ్ దిగజార్చుకోవాలనుకోలేదు. వైఎస్ జగన్ అలా కాదు, ఎప్పుడో పాతాళానికి దిగజారిపోయాడు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే తీరు ముందు ముందు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి, వైఎస్ జగన్ విషయంలో ఆశించొచ్చేమో.! అదే గనుక జరిగితే, వైఎస్ జగన్ అనే పేరు, రాష్ట్ర రాజకీయాల నుంచి అత్యంత వేగంగా కనుమరుగైపోవచ్చు

సినిమా

Vishnu Priya: చిక్కుల్లో నటి విష్ణుప్రియ..! ఆమెపై క్రిమినల్ కేసు నమోదుకు...

Vishnu Priya: సినీ నటి, బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పోలిస్ కేసు నమోదయింది. ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్న పబ్లిసిటీ యువతను పెడదోవ పట్టించేలా...

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

రాజకీయం

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

ఎక్కువ చదివినవి

Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్...

Adivi Sesh: హీరోగా అడివి శేష్-నిర్మాతగా స్టార్ హీరో..! సినిమా.. నిజమేనా..!?

Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు అడివి శేష్. విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే నటుడిగా ఆయనకు పేరు. ‘ఎవరు, మేజర్, హిట్-ది సెకండ్ కేస్, గూఢచారి’ వంటి వరుస హిట్లు...

విజయ్ అఫిడవిట్‌లో మళ్లీ తప్పులు.. ఆస్తుల లెక్కలపై కొత్త చర్చ

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి నటుడు విజయ్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజకీయ రంగంలో అడుగుపెట్టి పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్న విజయ్, ఇప్పుడు ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో వచ్చిన వరుస తప్పుల...

Daily horoscope: వృషభం వారికి ఆర్థిక లాభాలు.. ధనుస్సు వారికి ప్రయాణాల్లో జాగ్రత్త

“ఏప్రిల్ 11 , 2026 శనివారం రాశిఫలాలు” ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి లాభాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలను సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం వంటి అంశాల్లో...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...