Switch to English

తమిళనాడు, కేరళల్లో పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్ర సూపర్ హిట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,942FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్ని గత కొద్ది రోజులుగా సందర్శించి, ఈ రోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు.

సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత.. అనే నినదాన్ని ఇటీవల బలంగా వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, వ్యక్తిగత హోదాలో తన వెంట తన కుమారుడు అఖిరానందన్ అలాగే స్నేహితుడు ఆనంద్ సాయిని.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల సందర్శన నిమిత్తం తీసుకెళ్ళారు.

ఆయా ఆలయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళలోని దేవాలయాల్లోనూ అలాగే తమిళనాడులోని దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కి అక్కడి స్థానిక అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.

అలాగే, స్థానికంగా హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంచుకున్న కొందరు యువకులు, పెద్దవారు, మహిళలు.. పవన్ కళ్యాణ్‌కి ఘన స్వాగతం పలకడమే కాదు, శాలువాలు కప్పి సన్మానించారు.

నిజానికి, పవన్ కళ్యాణ్‌కి భక్తి భావం మొదటి నుంచీ వుంది. రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షతోపాటు పలు దీక్షల్ని చేపడుతూ వచ్చేవారు. రాజకీయాల్లోనూ అదే అలవాటుని, భక్తి భావాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తూ వస్తున్నారు.

నాలుగైదేళ్ళ క్రితమే, ఆయా పుణ్యక్షేత్రాల్ని సందర్శించాల్సి వుందనీ, అప్పట్లో వీలుకాలేదనీ, ఇప్పుడు కాస్త వీలు చూసుకుని.. దేవాలయాల సందర్శనార్థం వచ్చానని పవన్ కళ్యాణ్, తమిళ, కేరళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ పర్యటనల్లోనే తిరుపతి లడ్డూ వ్యవహారంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి. ‘సిట్’ విచారణ జరుగుతోందనీ, నిందితుల అరెస్ట్ కూడా జరిగిందని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు.

తమ హయాంలో దేవాలయాల పవిత్రత దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. కేరళలో కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్నీ, తిరువళ్ళంలోని పరశురామర్ దేవాలయాన్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్. తమిళనాడులోని తంజావూరు సమీపంలోని స్వామినాథ స్వామి (కుమారస్వామి) దేవాలయాన్నీ, తిరుచందూర్ బాలమురుగన్ దేవాలయాన్నీ, కుంభకోణంలో కుంభేశ్వర్ దేవాలయాన్నీ, పళనిలోని దండాయుధపాణి క్షేత్రాన్నీ, తిరుపడంకుండ్రంలో మురుగన్ దేవాలయాన్నీ, మధురైలోని మీనాక్షి దేవాలయాన్నీ, పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ దేవాలయాన్నీ.. మరికొన్ని ముఖ్యమైన దేవాలయాల్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్.

షష్ట షన్ముగ దేవాలయాల సందర్శనలో భాగంగా ఆయా దేవాలయాల్ని సందర్శించి, ప్రత్యేక పూజల్ని కుమారుడు అకిరా నందన్‌తో కలిసి నిర్వహించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, పైన పేర్కొన్న దేవాలయాల సందర్శన సమయంలోనూ స్వల్పంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు ఆరోగ్యం పరంగా. అయినాగానీ, గతంలోనే నిర్వహించాల్సిన ఈ దేవాలయాల సందర్శనను ఇంకోసారి వాయిదా వేసే ఉద్దేశ్యం లేక.. అనారోగ్య సమస్యలతోనే, ఆధ్మాత్మిక యాత్రను పూర్తి చేశారు.

కాగా, తమిళనాడులో స్థానిక ప్రజల నుంచి ‘సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు పవన్ కళ్యాణ్ యెదుట వినిపించాయి. తమిళంలో పవన్ కళ్యాణ్, తనను కలిసేందుకు వచ్చిన తమిళనాడు వాసులతో ముచ్చటించారు.

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్రను తమిళ మీడియా ప్రత్యేకంగా కవర్ చేయడం గమనార్హం.

సినిమా

BIGG BOSS 9 TELUGU E92: రీతూ ఎలిమినేట్… ఫైనల్ కౌంట్‌డౌన్‌...

బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారం ఆదివారం ఎపిసోడ్ బాగా ఎమోషనల్‌గా, అదిరిపోయే డ్రామాతో నిండిపోయింది. హోస్ట్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో షో కి...

టూ అవర్స్ సినిమా… లైఫ్ మార్చేస్తుందని నమ్మను: ‘దండోరా’ డైరెక్టర్ మురళీకాంత్

‘దండోరా’ సినిమా చూసిన వెంటనే ప్రేక్షకుడు పూర్తిగా మారిపోతాడనే అంచనాలను డైరెక్టర్ మురళీకాంత్ స్పష్టంగా ఖండించారు. ముప్పై ఏళ్లు, పాతికేళ్ల వయసు వరకు వ్యక్తి గడుపిన...

బిగ్ బాస్ 9లో షాకింగ్ ట్విస్ట్: రీతూ చౌదరి ఎలిమినేషన్

బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం నిజంగా ప్రేక్షకులను కుర్చీ అంచులకు చేర్చే షాక్ ఇచ్చింది. అందరి ఊహలకు పూర్తిగా విరుద్ధంగా, యాంకర్‌గా మంచి...

BIGG BOSS 9 TELUGU E91: కల్యాణ్, ఇమ్మానియేల్, తనూజ.. ముందుకి;...

బిగ్ బాస్ సీజన్ 9 శనివారం నాటి 91వ ఎపిసోడ్ లో.. హోస్ట్ నాగార్జున స్టేజ్ ఎంట్రీతోనే మూడ్ హైపరైపోయింది. మొదటి ఫైనలిస్ట్ అయిన కల్యాణ్‌ను...

“ఇట్స్ ఓకే గురు” అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్-గుడ్ సినిమా: మెహర్...

‘ఇట్స్ ఓకే గురు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆనందంగా జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు మంచి స్పందన తెచ్చుకోవడంతో... ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు,...

రాజకీయం

గాంధీభవన్ వద్ద రేవంత్‌కు వ్యతిరేక పోస్టర్ల కలకలం

హైదరాబాద్ గాంధీభవన్ పరిసరాల్లో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టర్లు పెద్ద కలకలం రేపాయి. ఆదివారం ఉదయం కనిపించిన ఈ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వారణాసి సినిమాలో నటుడు...

రాయలసీమ ‘రాతన’లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రాతన గ్రామంలో దివంగత మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు  నూతన విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ,...

చేసింది చెప్పుకోలేక పోయాం అన్న జగన్‌కి… టీడీపీ కేడర్ నుంచి వర్షంలా వ్యంగ్యాస్త్రాలు!

రాజకీయాలలో మాటల దాడులు అంతం లేనివి. “చేసింది చెప్పుకోలేక పోయాం” అంటూ జగన్ మీడియా సమావేశాల్లో వాపోతూ ఉండగానే… మరో పక్క టీడీపీ కార్యకర్తలు సూటిగా, స్టైలిష్‌గా, ఘాటు వ్యంగ్యాస్త్రాలతో రిప్లై ఇస్తూ...

సంచలన వీడియో : మహా పాపం చేశానని రోదించిన రవి కుమార్

పరకామణి కేసులో నిందితుడిగా నిలిచిన రవి కుమార్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ “ఇది చిన్న చోరీ మాత్రమే” అని వ్యాఖ్యానించగా, ఆ మాటలపై రవి...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

ఎక్కువ చదివినవి

మంగళగిరిలో లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్‌లో వినతుల వర్షం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన 76వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి ఒక్కరినీ...

ప్రజలకు చేరువగా ఉండే పాలన కోసం డీడీఓ విప్లవం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు (డీడీఓ) కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్...

జగన్ వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలకు దెబ్బ : మీడియాతో చంద్రబాబు

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల షాక్!

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నట్లు  వారు తెలిపారు....

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...