Switch to English

తమిళనాడు, కేరళల్లో పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్ర సూపర్ హిట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,840FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు అలాగే కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల్ని గత కొద్ది రోజులుగా సందర్శించి, ఈ రోజు సాయంత్రం గన్నవరం చేరుకున్నారు.

సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత.. అనే నినదాన్ని ఇటీవల బలంగా వినిపిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, వ్యక్తిగత హోదాలో తన వెంట తన కుమారుడు అఖిరానందన్ అలాగే స్నేహితుడు ఆనంద్ సాయిని.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల సందర్శన నిమిత్తం తీసుకెళ్ళారు.

ఆయా ఆలయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళలోని దేవాలయాల్లోనూ అలాగే తమిళనాడులోని దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్‌కి అక్కడి స్థానిక అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.

అలాగే, స్థానికంగా హిందూ ధర్మ పరిరక్షణపై అవగాహన పెంచుకున్న కొందరు యువకులు, పెద్దవారు, మహిళలు.. పవన్ కళ్యాణ్‌కి ఘన స్వాగతం పలకడమే కాదు, శాలువాలు కప్పి సన్మానించారు.

నిజానికి, పవన్ కళ్యాణ్‌కి భక్తి భావం మొదటి నుంచీ వుంది. రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షతోపాటు పలు దీక్షల్ని చేపడుతూ వచ్చేవారు. రాజకీయాల్లోనూ అదే అలవాటుని, భక్తి భావాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తూ వస్తున్నారు.

నాలుగైదేళ్ళ క్రితమే, ఆయా పుణ్యక్షేత్రాల్ని సందర్శించాల్సి వుందనీ, అప్పట్లో వీలుకాలేదనీ, ఇప్పుడు కాస్త వీలు చూసుకుని.. దేవాలయాల సందర్శనార్థం వచ్చానని పవన్ కళ్యాణ్, తమిళ, కేరళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ పర్యటనల్లోనే తిరుపతి లడ్డూ వ్యవహారంపై మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి. ‘సిట్’ విచారణ జరుగుతోందనీ, నిందితుల అరెస్ట్ కూడా జరిగిందని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు.

తమ హయాంలో దేవాలయాల పవిత్రత దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. కేరళలో కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయాన్నీ, తిరువళ్ళంలోని పరశురామర్ దేవాలయాన్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్. తమిళనాడులోని తంజావూరు సమీపంలోని స్వామినాథ స్వామి (కుమారస్వామి) దేవాలయాన్నీ, తిరుచందూర్ బాలమురుగన్ దేవాలయాన్నీ, కుంభకోణంలో కుంభేశ్వర్ దేవాలయాన్నీ, పళనిలోని దండాయుధపాణి క్షేత్రాన్నీ, తిరుపడంకుండ్రంలో మురుగన్ దేవాలయాన్నీ, మధురైలోని మీనాక్షి దేవాలయాన్నీ, పాలముదిరచోలైలోని సోలమలై మురుగన్ దేవాలయాన్నీ.. మరికొన్ని ముఖ్యమైన దేవాలయాల్నీ సందర్శించారు పవన్ కళ్యాణ్.

షష్ట షన్ముగ దేవాలయాల సందర్శనలో భాగంగా ఆయా దేవాలయాల్ని సందర్శించి, ప్రత్యేక పూజల్ని కుమారుడు అకిరా నందన్‌తో కలిసి నిర్వహించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, పైన పేర్కొన్న దేవాలయాల సందర్శన సమయంలోనూ స్వల్పంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు ఆరోగ్యం పరంగా. అయినాగానీ, గతంలోనే నిర్వహించాల్సిన ఈ దేవాలయాల సందర్శనను ఇంకోసారి వాయిదా వేసే ఉద్దేశ్యం లేక.. అనారోగ్య సమస్యలతోనే, ఆధ్మాత్మిక యాత్రను పూర్తి చేశారు.

కాగా, తమిళనాడులో స్థానిక ప్రజల నుంచి ‘సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్’ అంటూ నినాదాలు పవన్ కళ్యాణ్ యెదుట వినిపించాయి. తమిళంలో పవన్ కళ్యాణ్, తనను కలిసేందుకు వచ్చిన తమిళనాడు వాసులతో ముచ్చటించారు.

అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ఆధ్మాత్మిక యాత్రను తమిళ మీడియా ప్రత్యేకంగా కవర్ చేయడం గమనార్హం.

సినిమా

అల్లు అర్జున్ డ్యుయల్ రోల్..?

పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ...

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న...

‘భైరవి’ పాత్ర చేయడం నా అదృష్టం : తమన్నా

'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్‌గా రూపొందిన 'ఓదెల 2' ఏప్రిల్‌ 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌,...

స్టైలిష్ లుక్ లో మహేశ్, సితార.. ఈ స్టిల్స్ చూశారా..

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు. ఎంత...

నిన్ను నువ్వు తిట్టుకుంటే సినిమా హిట్టవుతుందా ‘రాబిన్ హుడ్’.?

మార్చి 28న నితిన్ కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లేమో కాస్తంత ఇన్నోవేటివ్‌గానే డిజైన్ చేశారు కూడా.! శ్రీలీల హీరోయిన్. వెంకీ...

రాజకీయం

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

పదకొండు వర్సెస్ మూడు, ఇరవై మూడు.!

‘మేం అధికారంలోకి వస్తే, పదకొండు అనే నెంబర్‌ని పూర్తిగా తొలగిస్తాం..’ అని గనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే.? అసలు అలా జరుగుతుందా.? ఛాన్సే లేదు.! కానీ, ఇలాంటి...

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

ఎక్కువ చదివినవి

బూతులు లేవు, బాధ్యతలు మాత్రమే.! కూటమి సర్కారుకి జన నీరాజనం.!

అసెంబ్లీ సమావేశాలు అంటే, బూతులే.. ఒకప్పుడు.! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూడ ముచ్చటగా వుంటున్నాయ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల గురించి ప్రస్తావన వస్తోంటే, ఇంటిల్లిపాదీ ప్రత్యక్ష ప్రసారాల్ని...

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..!

చట్టాలు ఎన్నొచ్చినా.. ఎన్ని రకాల శిక్షలు ప్రవేశ పెట్టినా.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళా సంరక్షణ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినా ఎక్కడో ఒకచోట.. ఏదో ఒకరంగా వాళ్లని హింసిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

యూఎస్ లోని ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్.. అత్త, కోడలు, కొడుకు మృతి..

అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్ జరగ్గా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల పల్లికి చెందిన మాజీ...