ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల శ్రీవారికి మొక్కులు చెల్లించారు. తమ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని కిచెన్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం బారి నుంచి మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతని కాళ్లు, చేతలకు గాయాలు అయ్యాయి.
ఈ రోజు ఉదయమే పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా కొణిదెల ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముందుగా డిక్లరేషన్ సమర్పించారు. ఆ తర్వాత వరాహ స్వామిని దర్శించుకున్నారు.
ఆ తర్వాత కల్యాణ కట్టకు చేరుకుని సాధారణ భక్తుల మాదిరిగానే తలనీలాలు సమర్పించారు. రేపు సోమవారం ఉదయం వేకువ జామున వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తారు. సుప్రభాత సమయంలో స్వామి వారిని దర్శించుకుంటారు.
ఆ తర్వాత అన్నదాన సత్రానికి విరాళం అందజేస్తారు. స్వామివారి అన్నదానం కూడా స్వీకరిస్తారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న శ్రీమతి అన్నా కొణిదెల గారు
• పద్మావతి కళ్యాణకట్టలో సామాన్య భక్తులతో కలిసి తలనీలాల సమర్పణ
• టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రాలపై సంతకం
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని తలచుకున్న వెంటనే… pic.twitter.com/zG97x7WuEj
— JanaSena Party (@JanaSenaParty) April 13, 2025