Switch to English

జనసేన జయకేతనం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,801FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభ విజయవంతం చేసినందుకు జనసేన అధినేత పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక నోట్ రాసుకొచ్చారు.

జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకుని 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడంలో ఎంతోమంది కష్టపడ్డారు, సభ ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు పవన్ కళ్యాణ్.

ఈ వేడుకను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకునేలా అన్ని విధాలుగా సహకరించిన పోలీస్ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ క్రమంలో ఐపీఎస్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా, కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారికి క్షేత్ర స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో పాల్గొన్న కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఈ సభకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక పార్టీ తరపున ఈ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసి జయకేతనం సభ విజయవంతం చేసిన మంత్రివర్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత పిడుగు హరిప్రసాద్ గారికి, కాకినాడ ఎంపీ శ్రీ ఉదయ్ గారికి, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ జిల్లా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

కార్యమ్రమం ఏర్పాట్లను.. సభాస్థలం ఎంపిక నుంచి సభ పూర్తయ్యే వరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించిన జనసేన పార్టీ ప్రోగ్రా మ్స్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ రావు గారికి, కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

సభకు హాజరైన జనసేన శ్రేణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య బృంధాలు సిద్ధం చేసిన డాక్టర్ సెల్ బృందానికి, సభా ప్రాంగణంలో సేవలు అందించిన వాలంటీర్ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా, సభ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు డాక్యుమెంటరీగా వివరిస్తూ ప్రజలకు తెలిసేలా చేస్తున్న జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్.

అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులకు వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసిన జనసేన సాంస్కృతిక విభాగం కమిటీకి, శ్రీ హరీష్ పాయి గారికి, కళాకారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్.

సభ విజయవంతం అవ్వడానికి పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

సినిమా

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...

సంక్షోభమే అవకాశం.! అదే విజనరీ చంద్రబాబు ఘనత.!

సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమే విజనరీ.! ఔను, ఆ విజనరీ నారా చంద్రబాబు నాయుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రతిసారీ చంద్రబాబు చెప్పే మాట ఇదే.. సంక్షోభంలోంచి అవకాశాలు వెతుక్కోమని. నేటి...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 21 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 21-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ అష్టమి మ. 1.49 వరకు,...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం...