అడవి తల్లి బాటతో ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి – పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,413FansLike
57,764FollowersFollow

దేశంలో వేగంగా జరుగుతున్న జాతీయ రహదారుల నిర్మాణం స్ఫూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం “అడవి తల్లి బాట” పథకాన్ని ప్రారంభించింది. పీఎం జన్ మన్ పథకం, ఉపాధి హామీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌లతో కలిపి రూ.1005 కోట్లతో ఈ ప్రాజెక్టు అమలు అవుతోంది. స్వాతంత్ర్యం తర్వాత రహదారి కూడా చూడని గిరిజన గ్రామాలను ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “గిరిజన గ్రామాల్లో నిర్మిస్తున్న ఈ రోడ్లు వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెస్తాయి. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. అడవి తల్లి బాట పథకానికి వెంటనే రూ.50 కోట్ల నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు” అన్నారు.

దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతంగా సాగుతోందని ఆయన తెలిపారు. 2014లో 91 వేల కిలోమీటర్ల రహదారులు ఉండగా, ఇప్పుడు 1,46,204 కిలోమీటర్లకు పెరిగాయని చెప్పారు. రోజుకు 34 కిలోమీటర్ల మేర కొత్త రహదారులు నిర్మిస్తున్నామని, గతంలో ఇది 11 కిలోమీటర్లే అని గుర్తుచేశారు.

గత ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందించినా రోడ్ల అభివృద్ధి జరగలేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం రోడ్లతో పాటు పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాలు కొనసాగాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. “కూటమి ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే మనం కలిసే పరిష్కరించుకోవాలి. కూటమి బలంగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతుంది” అని ఆయన అన్నారు.

జాతీయ రహదారుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘చిరంజీవి దోశ “మల్లెపూవు”లా ఉంటుంది..’ జ్ఞాపకాలు పంచుకున్న నటి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే గుర్తొచ్చేది డ్యాన్స్, ఫైట్స్, కామెడీ. అయితే.. చిరంజీవి అంటే గుర్తొచ్చేవి మరొక విషయం ఆయన వేసే దోశ. ‘చిరంజీవి దోశ’గా ఆయనకు పేటెంట్ కూడా ఉంది. ఆయనకు...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

దాడులు ఒకవైపు… చర్చల సంకేతాలు మరోవైపు… మధ్యప్రాచ్యం ఉత్కంఠ

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇది అధికారికంగా ప్రకటించిన ప్రపంచ యుద్ధం కాదు. కానీ Israel – Iran మధ్య ప్రత్యక్ష సైనిక దాడులు, అలాగే United States ఇజ్రాయెల్‌కు అందిస్తున్న...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ...