Switch to English

పవన్ కళ్యాణ్ నిబద్ధత.! ఆశ్చర్యపోతున్న తెలుగు తమ్ముళ్ళు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,961FansLike
57,764FollowersFollow

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను.. అన్న మాటకు కట్టుబడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి స్నేహ హస్తం అందిస్తున్న వైనానికి తెలుగు తమ్ముళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. పొత్తుల చర్చలు ఇంకా అధికారికంగా ప్రారంభం కాకపోయినా, టీడీపీ అధినేత చంద్రబాబు కష్టకాలంలో వున్న దరిమిలా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలుస్తున్నారు.

తాజాగా, చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో కలిసేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్న దరిమిలా, సోషల్ మీడియాలో ఇప్పటిదాకా జనసేన మీద అసహనంతో ఊగిపోయిన తెలుగు తమ్ముళ్ళలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ పవన్ కళ్యాణ్‌ని అపార్థం చేసుకున్నామని పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెబుతున్నారు.

అంతే కాదు, జనసేనానికి స్వాగతం పలికేందుకు రాజమండ్రిలో తెలుగు తమ్ముళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలుగు తమ్ముళ్ళు రాజమండ్రికి తరలి వెళుతుండం ఇంకాస్త ఆసక్తికరమైన పరిణామం.

టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్నా, రెండు పార్టీల మధ్య ఓట్ షేరింగ్ కష్టమంటూ ఇప్పటిదాకా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ వచ్చారు. అయితే, ఓటు షేరింగ్ పక్కాగా జరుగుతుందని తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. టీడీపీ – జనసేన చెరిసగం కాదు, పరిస్థితుల్ని బట్టి తమకంటే జనసేన నాలుగైదు సీట్లు ఎక్కువ తీసుకున్నా సహకరిస్తామన్నది తెలుగు తమ్ముళ్ళ తాజా వాదనగా కనిపిస్తోంది.

‘చంద్రబాబు గనుక ఎన్నికల్లోపు జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేతకు మద్దతిస్తాం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు..’ అనే అభిప్రాయాలూ కొందరు టీడీపీ మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అయితే, షరామామూలుగానే టీడీపీ మద్దతుదారుల్లో ఇంకో వర్గం మాత్రం, కొంత కులజాడ్యంతో వ్యవహరిస్తోంది. అది చాలా తక్కువ శాతమే అనుకోండి.. అది వేరే సంగతి. ఆ వర్గం కూడా, పవన్ కళ్యాణ్ ఇంతలా చంద్రబాబుకి అండగా నిలవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, జనసేన కార్యకర్తల్ని రాజమండ్రి విమానాశ్రయానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక జనసేన నేతలకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. జనసేనాని కోసం జనాన్ని తరలించడమా.? నవ్విపోదురుగాక.! స్వచ్ఛందంగా ఆయన కోసం జనం తరలివస్తారు. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు జనసేన నేతలే మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.

1 COMMENT

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

ఎక్కువ చదివినవి

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. సైఫ్ కు ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు,...

మనోజ్ కు మరో షాక్ ఇచ్చిన మోహన్ బాబు.. ఇదేం ట్విస్ట్..!

మంచు ఫ్యామిలీలో రగడ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చూసే వాళ్లకు ఇదే పెద్ద ఎంటర్ టైన్ మెంట్ గా ఉంది. మనోజ్ ప్రతిసారి మీడియాను వెంటపెట్టుకుని వెళ్లి ఏదో ఒక రచ్చ చేస్తూనే...

తప్పయింది.. క్షమించండి.. జర్నలిస్ట్ సాయి

కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అయితే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి " ఏపీ గ్రోత్ స్టోరీస్ ఇన్ దావోస్-2025" పై ప్రచారం కల్పించేందుకుగాను ఏపీ ప్రభుత్వం...

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. జగన్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గత జగన్ పాలనకు తమ పాలనకు స్పష్టమైన తేడాను చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యక్తిగతంగా తిట్టడానికి పోకుండా.. తమ పనుల ద్వారానే జగన్...

పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టండి.. లక్ష్మీ మిట్టల్ ను కోరిన లోకేష్..!

దావోస్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వివరిస్తూ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. ఇక తాజాగా ఉక్కు దిగ్గజం...