హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 100కు పైగా ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంటలు, పశుసంపద, ప్రజల ప్రాణాలకు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ విధానంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు.

https://images.mid-day.com/images/images/2014/aug/Rapid-Rescue-Unit-vehicle.jpg

హనుమాన్ ప్రాజెక్ట్ (Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife) ద్వారా వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల రక్షణకూ సమాన ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటవీ సరిహద్దు గ్రామాల్లో ముందస్తు హెచ్చరికలు, వేగవంతమైన సహాయ చర్యలు, పరిహారం చెల్లింపులు వంటి వ్యవస్థలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద 93 ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 ప్రత్యేక అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 19 ప్రత్యేక బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉంటాయి.

ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, గిరిజన సహాయకులు, పారా వెటరెనరీ సిబ్బంది ఉంటారు. గ్రామ స్థాయిలో ‘వజ్ర’ బృందాలను ఏర్పాటు చేసి పాములు, ఇతర జంతువుల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన రెస్క్యూ కిట్లు కూడా అందిస్తున్నారు.

https://vspca.org/newsletters/images/ambulance.jpg

మానవ-వన్యప్రాణి సంఘర్షణలో ప్రాణనష్టం జరిగితే ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారికి 2 లక్షలు, పశువుల మరణానికి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2,107 కేసులు నమోదై, దాదాపు 4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఇప్పటివరకు 8 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజల ప్రాణాలు, పంటలను రక్షించడంలో ఇది కీలకంగా మారింది.

వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ టెక్నాలజీని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, హనుమాన్ డిజిటల్ యాప్ ద్వారా ముందస్తు హెచ్చరికలు అందించే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది, ఎన్జీవోలు కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రతను పరిరక్షించడమే హనుమాన్ ఫౌండేషన్ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వసుధైక కుటుంబం భావనతో కలిసి జీవించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

 

సినిమా

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

“మహిళల్ని అవమానించే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా”: జగన్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్రంగా స్పందించారు. మహిళలను ఉద్దేశించి ఇలాంటి అసహ్యకరమైన, దిగజారిన భాషను ఉపయోగించడం కేవలం...

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

87వ రోజు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి ప్రజా సమస్యలకు వేదికైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 87వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల...

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...