బీసీలు బలహీనులు కాదు.. దేశ రాజకీయాల్లో కీలక శక్తి: పవన్ కళ్యాణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,322FansLike
57,764FollowersFollow

బీసీలు సమాజంలో బలహీన వర్గాలు కాదని, దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మరియు బలమైన సామాజిక శక్తిగా నిలుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జనాభాలో 51 శాతం కంటే ఎక్కువ శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా ఎందుకు పూర్తి స్థాయి సాధికారత సాధించలేకపోతున్నామనే అంశంపై బీసీ సంఘాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, బీసీ వర్గాల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వర్గాల్లోని అన్ని ఉప కులాలు, సామాజిక వర్గాలు విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీల్లో ఎవరికైనా ఉన్నత అవకాశాలు లేదా పదవులు దక్కితే అది మొత్తం సమాజానికి దక్కిన గౌరవంగా భావించే విశాల దృక్పథం రావాలని సూచించారు.

బీసీలు బలహీనులు కాదు.. దేశ రాజకీయాల్లో కీలక శక్తి: పవన్ కళ్యాణ్

మనలో ఒకరు ఎదుగుతుంటే మిగతావారు ప్రోత్సహించాల్సిందిపోయి కిందకు లాగాలని చూడటం వల్లే బీసీలు రాజకీయంగా వెనుకబడుతున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ముందుగా తమలోని లోపాలను సరిదిద్దుకుని, ఐక్యతతో ముందుకు సాగితేనే బలమైన రాజకీయ శక్తిగా ఎదగగలమన్నారు.

కేవలం నినాదాలతో కాకుండా ప్రతి ఉప కుల సంఘం చట్టబద్ధమైన తీర్మానాలతో ముందుకు రావాలని, సంఘాల వారీగా ఐక్యతను చాటాలని సూచించారు. అలా జరిగితేనే ఇతరుల చేతుల్లో పావులుగా మారకుండా స్వయంగా రాజకీయ హక్కులు సాధించగలమన్నారు. బీసీల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, దేశ ప్రధానమంత్రి కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తేనని గుర్తుచేశారు.

వృత్తి ఆధారిత కులాల్లో అసాధారణ నైపుణ్యం, కళాత్మకత దాగి ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. విశ్వకర్మల వంటి వర్గాల కళా నైపుణ్యం దేశ గర్వకారణమని కొనియాడారు. దేవాలయ నిర్మాణాలు, శిల్పకళ వంటి అద్భుతాలు ఆయా వర్గాల ప్రతిభ వల్లే సాధ్యమవుతున్నాయని చెప్పారు. జపాన్‌లో కుమ్మరి వృత్తికి ఇచ్చే గౌరవాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, మన దేశంలో కూడా అన్ని వృత్తి కులాలకు సమాన గౌరవం దక్కాలని ఆకాంక్షించారు.

బీసీ నాయకులు ఉన్నత రాజకీయ పదవుల్లోకి రావడం చూస్తే ఎంతో ఆనందిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలు ఓట్లుగా విడిపోవడం వల్లే అధికారానికి దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు. రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను ప్రస్తావిస్తూ, అన్ని బీసీ వర్గాలు ఏకతాటిపైకి వస్తే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. క్రమశిక్షణతో కూడిన వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగితే బీసీలు అన్ని రంగాల్లో అగ్రస్థానానికి చేరుకుంటారని తెలిపారు.

సినిమా

S. JANAKI: “గుడికే చేరిన దీపం.. పడమటి సంధ్యా రాగం”

 "కొండల్లో... కోనల్లో... కూ యన్న ఓ కోయిల..." ఆ పాటలో వినిపించిన ఆ కోయిల గాత్రం ఇక కొత్త పాటల్లో వినిపించకపోవచ్చు. కానీ ఆ స్వరం మాత్రం...

 శ్రీకాంత్‌తో రిలేషన్‌పై రీతూ క్లారిటీ.. ఎంత సాయం చేశాడంటే?

బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి గతంలో చీమకుర్తి శ్రీకాంత్‌తో తన రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తమ ఇద్దరికీ...

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

శస్త్రచికిత్స విజయవంతం.. త్వరలోనే ప్రజా సేవలోకి తిరిగి వస్తారు: పవన్ ఆరోగ్యంపై చంద్రబాబు

ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం...

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్‌పై వివాదం.. వైసీపీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అమరావతికి కీలకమైన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ అంశాన్ని...

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహం వారికి గుర్తింపు.. మీనం వారికి శుభవార్త

జులై 9, 2026 గురువారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్త అవసరమని సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

హస్తకళాకారులకు పవన్ హామీ అమలు.. ప్రత్యేక వైద్య శిబిరాల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారులకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా...

‘డ్యూ డేట్’ ఘనంగా ప్రారంభం.. కోర్ట్‌రూమ్ డ్రామాపై ఆసక్తి

తెలుగు సినీ పరిశ్రమలో పీఆర్‌ఓగా, జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ నిర్మిస్తున్న తొలి చిత్రం 'డ్యూ డేట్' ఘనంగా ప్రారంభమైంది. పవన్ తరిగోపులతో కలిసి వర్షిష్ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె మృతి...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...