‘అతి వ్యూహాలతో కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నారు..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద బాంబు పేల్చారు. కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన బీభత్సంపై జనసేన అధినేత ఈ రోజు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఆ ఘటనలకు జనసేన సహా విపక్షాలు కారణమని ఆరోపించడంపై జనసేనాని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులూ జనసేన పేరుని ఈ వివాదంలోకి లాగడాన్ని జనసేనాని తప్పు పట్టారు.
అంబేద్కర్ లాంటి మహనీయుడ్ని ఓ జిల్లా పేరుకి పరిమితం చేయాలన్న కుటిల రాజకీయాన్ని నేటి యువత గుర్తించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్రంలో 26 జిల్లాలుంటే, 25 జిల్లల్లో పేరు విషయమై జరగని అల్లర్లు కోనసీమలో ఎందుకు జరిగాయి.? ఆయా జిల్లాల్లో ఆందోళనలు వున్నా, అక్కడ అభ్యంతరాల స్వీకరణకు ముందుకు రాని ప్రభుత్వం, కోనసీమలోనే ఎందుకు అభ్యంతరాల స్వీకరణ.. అంటూ వ్యూహాత్మకంగా 30 రోజులు గడువు ఇచ్చింది.? అంటూ ప్రశ్నించారు జనసేనాని.
కోనసీమలో వైసీపీనే అగ్గి రాజేసిందనీ, తమ పార్టీ మంత్రి, తమ పార్టీ ఎమ్మెల్యే ఇళ్ళని అధికార పార్టీ నాయకులే తగలబెట్టించారని జనసేనాని ఆరోపించారు. ‘ఇది కులాల మధ్య గొడవ కాదు. ఇది కోనసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం. కుల మతాలకతీతంగా, కోనసీమ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలు, వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల అభ్యంతరాలు తెలుసుకోవాలి..’ అంటూ జనసేనాని సూచించారు.
కోడి కత్తి ఘటన, వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇలాంటివాటన్నిటినీ వైసీపీ రాజకీయంగా వాడుకుందనీ, అదే తరహాలో కోనసీమలో అలజడి కూడా వైసీపీ ప్రేరేపించినదేనని జనసేనాని ఆరోపించారు. ‘అప్పట్లో తుని రైలు ఘటనకు బాధ్యత మీదే.. ఇప్పుడు ఈ ఘటనకీ బాధ్యత మీదే..’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాలు న్యాయస్థానల్లో వీగిపోతే, న్యాయస్థానాల మీదా జడ్జిల మీద నిందలు వేసే అధికార పార్టీ నాయకులకు, ఇలాంటి ఘటనల్లో ఇతరుల మీదకు నెపాన్ని నెట్టేయడం పెద్ద కష్టమేమీ కాదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. దేవాలయాల మీద దాడులు, మహిళలపై అత్యాచారాలు.. ఇలా అన్ని ఘటనల్లోనూ ఇతరుల మీద నెపం నెట్టేసి, ప్రభుత్వంలో వున్నవారు బాధ్యతల నుంచి తప్పించుకు తిరుగుతున్నారని పవన్ మండిపడ్డారు.
మహిళలపై అఘాయిత్యాలకు వాళ్ళ తల్లుల పెంపకం సరిగ్గా లేకపోవడమే కారణమని హోంమంత్రి అన్నారనీ, అలాంటి హోంమంత్రి అమలాపురం గొడవలకీ జనసేనకీ ముడిపెట్టడం మాకేమీ ఆశ్చర్యపరచలేదని జనసేనాని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
ఏదిఏమైనా, కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్న వైసీపీ.. అనడం ద్వారా జనసేనాని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం చేస్తున్న పనుల్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పేశారన్నది నిర్వివాదాంశం.
420711 567708excellent . Thanks for informations . Ill be back. Thanks again 850835
577955 945042I visited a great deal of website but I conceive this 1 holds something particular in it in it 800947