Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వాలతోపాటు దాతలు, సినీరంగ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. వీరిలో నాగబాబు తనయ నిహారిక ఉన్నారు. ఇటివలే గ్రామీణ నేపథ్యంలో కమిటీ కుర్రోళ్లు సినిమా తెరకెక్కించి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఈక్రమంలో వరద బాధితులను తన వంతుగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు.
బాబాయ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ఫూర్తితో వరదలతో దెబ్బదిన్న 10గ్రామాలకు.. గ్రామానికి 50వేలు చొప్పున రూ.5లక్షలు విరాళం ప్రకటించారు. నిహారిక తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆమె దాతృత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించి అభినందించారు.
‘ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి 10గ్రామాలకు 50వేలు చొప్పును రూ.5లక్షలు ప్రకటించిన అన్నయ్య నాగబాబుగారి కుమార్తె నిహారికకు అభినందనలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడాలనే ఆమె సంకల్పం సంతోషాన్నిచ్చింది. పల్లెటూరు నేపథ్యంలో నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు తెరకెక్కించి విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య @NagababuOffl గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 9, 2024