‘లాక్డౌన్లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే అదే తరహాలో పరిస్థితులు కన్పిస్తునాయి..’ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, జనసేన అధినేత వద్ద తమ వెతల్ని విన్పించారు వీడియో కాన్పరెన్స్ ద్వారా.
లాక్డౌన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కింద ఎంతమంది భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకుందో చెప్పాలంటూ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ హయాంలో ఇసుక కుంభకోణం నడిచిందని ఆరోపించిన వైఎస్సార్సీపీ, తాము అధికారంలోకి రాగానే కొత్త విధానం అంటూ కాలయాపన చేసింతనీ, ఈ క్రమంలో ఇసుక లభ్యత లేక చాలామంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని ఆదుకునేందుకు జనసేన తనవంతుగా ప్రయత్నించిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. అధికార పార్టీకి చెందిన నేతలు ఇసుక కుంభకోణాల్లో మునిగిపోయారంటూ విపక్షాలు మండిపడ్తున్నాయి.
చంద్రబాబు హయాంలో ఇసుక ధరకు రెండింతలు.. మూడింతలు ధర పలుకుతోందిప్పుడు. అయినాగానీ, ప్రభుత్వం మాత్రం ‘అంతా పారదర్శకత్వంగానే జరుగుతోంది’ అని చెబుతుండడం గమనార్హం. లాక్డౌన్ ముగిశాక, భవన నిర్మాణ రంగ కార్మికులతో ప్రత్యక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశముంది. తమ తరఫున నినదిస్తున్న జనసేనానికి భవన నిర్మాణ రంగ కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి pic.twitter.com/WIarzz6lSG
— JanaSena Party (@JanaSenaParty) May 31, 2020
658642 792342Hey there! Very good post! Please when all could see a follow up! 678476
76421 102632Perfect just what I was looking for! . 467272
867516 479355We guarantee authentic brands avoiding inferior commercial imitations, or even dangerous counterfeits. 202165