Switch to English

పవర్ స్టార్ ‘గుర్తుండిపోయే జ్ఞాపకాలు’..ఇన్ స్టాలో చేసిన తొలి పోస్ట్ ఇదే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan) ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అకౌంట్ ఓపెన్ చేసి పది రోజులు దాటింది. ప్రస్తుతం పవన్ ని ఇన్ స్టా లో 2.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అందులో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఎట్టకేలకు ఆయన తొలి పోస్ట్ గా ఓ వీడియోని షేర్ చేశారు. తన సినీ జీవితంలో ఆయన కలిసిన పని చేసిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ ‘ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు’ పేరుతో వీడియోని పంచుకున్నారు. ‘చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులైన, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి’ అని నోట్ రాశారు.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi),నందమూరి బాలకృష్ణ( Balakrishna)నాగార్జున( Nagarjuna)వంటి సీనియర్ హీరోలు, ప్రభాస్( Prabhas), జూనియర్ ఎన్టీఆర్( Jr NTR), రామ్ చరణ్( Ram Charan), మహేష్ బాబు( Mahesh Babu),అల్లు అర్జున్( Allu Arjun తదితర యంగ్ హీరోలు, దివంగత దర్శకుడు కే విశ్వనాథ్, అమితాబ్ బచ్చన్ తదితరులు కనిపించారు. ఇప్పటివరకు పవన్ నటించిన సినిమాలు, హాజరైన వేడుకలకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఈ వీడియోలో చూపించారు.

పవన్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికొస్తే ఆయన తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej)తో కలిసి నటిస్తున్న ‘బ్రో’ ఈనెల 28న విడుదల కానుంది. దీంతోపాటు పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ చిత్రాలను పూర్తిచేసే పనిలో ఉన్నారు.

పవర్ స్టార్ ఇన్ స్టా హైలెట్స్ ఇవే..

* ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా మాత్రమే అభిమానులకి చేరువగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)జూలై 4న ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఆరోజు సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన ఇన్స్టాలోకి అడుగుపెట్టారు.

* ‘ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో.. జై హింద్’ అని ఇన్స్టా బయోలో రాసుకున్నారు.

* ఒక్క పోస్టు పెట్టకుండా ఈ ఫ్లాట్ ఫామ్ లో అతి తక్కువ కాలంలో వన్ మిలియన్ మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవర్ స్టార్.

 

View this post on Instagram

 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

సినిమా

ఎల్లమ్మ ఛాన్స్ ఎవరికంటే..?

బలగం సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న వేణు యెల్దండి తన సెకండ్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. బలగం బ్లాక్ బస్టర్ ఇచ్చాడు...

మొదటి పార్టును మించి ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

యూత్ ను ఓ ఊపు ఊపేసిన మ్యాడ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ అయింది. ఇప్పుడు...

వేదిక హాట్ ఫోజులు.. చూస్తే అంతే సంగతులు..

ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది వేదిక. ఆమె నాజూకు అందాలను చూసి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. గతంతో పోలిస్తే ఆమె రచ్చ...

కన్నప్ప సినిమా అందరికీ నచ్చేలా తీశాం.. హీరో మంచు విష్ణు..!

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప రోజురోజుకూ అంచనాలు పెంచేస్తోంది. ఇందులో ఆయన కన్నప్ప పాత్రలో నటించారు. ముఖేష్ కుమార్...

తెలుగు భాష బూతులు మాట్లాడడానికేనా తమన్నా..?

సౌత్ సినీ పరిశ్రమలో రెండు దశాబ్ధాల కెరీర్ పూర్తి చేసుకున్న తమన్నా ఇప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతుంది. గ్లామర్ తో పాటు గ్రామర్ కూడా...

రాజకీయం

అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..!

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచేలా రాష్ట్ర...

తమిళనాడు నా జీవితాన్ని ప్రభావితం చేసింది.. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు

దేశంలో భాషా పరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో డీఎంకే దీన్ని బాగా హైలెట్ చేస్తోంది. హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాన్నే రాజకీయంగా మార్చేసింది. దానిపై ఇప్పటికే ఏపీ డిప్యూటీ...

మాజీ మంత్రి విడదల రజనీకి అరెస్టు భయం.! అస్సలు లేదట.!

‘ఏం చేస్తారు.? మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.?’ అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ. ఒకప్పుడు తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కనని చెప్పుకున్న విడదల రజనీ,...

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

ఎక్కువ చదివినవి

జనసేన జయకేతనం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు..!

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభ విజయవంతం చేసినందుకు జనసేన అధినేత పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు...

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు మాత్రం ఆ ధోరణి మార్చుకోవడం లేదు....

15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు.! పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, అప్పుల కుప్పగా మారిపోయింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణకు గణనీయంగా ఆదాయాన్ని ఇచ్చే హైద్రాబాద్ నగరం, రాజధానిగా వుంది. కానీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని...

ఇండియన్‌ సినిమా క్వీన్‌ రష్మిక

నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న 'ఛావా' సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. యేసుబాయి పాత్రలో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఛావా సినిమా సూపర్ హిట్ కావడంతో...

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...