Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఈనాటిది కాదు.! ఏప్రిల్ తర్వాత ఏ క్షణాన అయినా వైఎస్ జగన్ సర్కారు కుప్ప కూలిపోతుందన్న ఊహాగానాలు ఈ మధ్య బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోవడం, రాజధాని గందరగోళం నేపథ్యంలో.. ఒత్తిడి తట్టుకోలేక.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు అధికార వైసీపీ సమాలోచనలు చేస్తోంది.
ఎమ్మెల్యేల పట్ల నానాటికీ పెరిగిపోతున్న వ్యతిరేకత.. దానికి తోడు, పార్టీలో తిరుగుబాట్లు.. ఈ నేపథ్యంలో ఇంకా ఎక్కువ కాలం ప్రభుత్వం నడవడం కష్టమని వైసీపీ భావిస్తుండొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘జూన్ నుంచి విశాఖకు వెళుతున్నాం..’ అని తాజాగా క్యాబినెట్ సహచరులకు క్యాబినెట్ సమావేశంలో సంకేతాలు ఇచ్చారట.
అంటే, విశాఖకు ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ అనే హోదా ఇచ్చేసినట్లుగా బిల్డప్ ఇచ్చి, ఆ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ఎన్నికలకు వైసీపీ వెళ్ళిపోతుందని అనుకోవాలేమో.! ఇలా ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే, జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు.. అదీ జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేదికపైనుంచి.
‘ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం..’ అన్నది జనసేనాని చేసిన వ్యాఖ్యల సారాంశం. మళ్ళీ ఆవిర్భావ దినోత్సవం అంటే, వచ్చే ఏడాది మార్చి 14న. మామూలుగా అయితే, అప్పటికి ఇంకా వైసీపీనే అధికారంలో వుండాలి. మధ్యంతర ఎన్నికలు జరిగితే మాత్రం.. కొత్త ప్రభుత్వం ఈ ఏడాదిలోనే ఏర్పాటవుతుంది.
ఆ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తమదేనని జనసేన బలంగా నమ్ముతోంది. గెలిచి, ఆవిర్భావ సభ జరుపుకుందాం.. అని పవన్ కళ్యాణ్ చెప్పారంటే.. ఈ ఏడాదిలోనే ఏపీలో మద్యంతర ఎన్నికలు జరగబోతున్నాయన్నమాట.
999845 216261Nicely picked details, numerous thanks towards the author. It is incomprehensive in my experience at present, nevertheless in common, the convenience and importance is mind-boggling. Regards and all the finest .. 528050
235474 319832Thank you for sharing with us, I conceive this web site actually stands out : D. 642788
101005 582756Id require to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 412950