Switch to English

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ నేతలకు సంబంధించిన ట్వీట్లను జనసేనాని ట్వీట్‌ చేస్తుండడంపై జనసైనికుల్లోనూ కొంత అసహనం వ్యక్తమవుతున్నప్పటికీ, కీలక విషయాలపై జనసేనాని సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్న తీరు, ఈ క్రమంలో ప్రముఖ నేతల ట్వీట్లను ప్రస్తావిస్తుండడం అభినందించాల్సిన విషయమే.

తాజాగా టీటీడీ భూముల వేలం వ్యవహారంపై జనసేనాని వరుస పెట్టి ట్వీట్లతో హోరెత్తించేశారు. ఇంకేముంది.? జనసైనికుల్లో ఫుల్‌ జోష్‌ నెలకొంది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయిపోయింది. మామూలుగానే పవన్‌ అభిమానులు, నిత్యం తమ అభిమాన నటుడు, రాజకీయ నాయకుడికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ట్రెండింగ్‌లో వుంచుతుంటారు. అలాంటిది, అత్యంత కీలకమైన అంశంపై తమ అధినేత ట్వీటేస్తే.. దాన్ని ఏ స్థాయి ట్రెండింగ్‌లోకి తీసుకెళ్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

జనసేనాని ట్వీట్‌ నేపథ్యంలో మంచు మనోజ్‌ కూడా స్పందించాడు. మరికొందరు సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంపై స్పందించాలని వున్నా, ‘రాజకీయ రచ్చ ఎందుకు’ అన్న కోణంలో మౌనం దాల్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో జనసేనాని సంయమనం పాటిస్తున్నారు. తాను సంయమనం పాటించడమే కాదు, జనసైనికులూ గ్రౌండ్‌ లెవల్‌లో సంయమనం పాటించేలా చూసుకుంటున్నారు.

చిన్న చిన్న విషయాలకే కేసులు నమోదు చేసేలా ప్రభుత్వం, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్న దరిమిలా, జనసైనికులెవరూ సంయమనం కోల్పోవద్దని జనసేనాని సూచిస్తున్నారు. అయితే, కొందరు జనసైనికులు మాత్రం ‘అన్నిటికీ తెగించే వున్నాం..’ అన్నట్టుగా తాము చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.

టీటీడీ విషయంలో వైఎస్‌ జగన్‌ గతంలో ఎలా వ్యవహరించారు, ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారన్నది సవివరంగా జనసైనికులు ప్రస్తావిస్తున్నారు సోషల్‌ మీడియాలో. సదావర్తి భూముల విషయంలో వైఎస్‌ జగన్‌ చేసిన యాగీని ఉదహరిస్తూ.. అప్పుడు నీతులు, ఇప్పుడేమో వేలం పాటలా.? అంటూ జనసైనికులు నిలదీస్తున్నారు.

మొత్తమ్మీద, జనసేనాని ట్వీట్ల పరంపర అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపిందన్నమాట. అయితే, ఈ డోస్‌ సరిపోదు.. ప్రత్యక్ష పోరులోకి జనసేనాని దిగాల్సి వుంది. కరోనా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు వస్తున్న దరిమిలా, జనసేనాని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాల్సిందే. అయితే, ఇంకా కొంత కాలం సోషల్‌ డిస్టెన్సింగ్‌ తప్పదు గనుక.. ప్రజా క్షేత్రంలోకి వెళ్ళాల్సి వస్తే.. జనసేనాని చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఎందుకంటే, పవన్‌ ఎక్కడుంటే అక్కడ జనసముద్రమే కదా.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...