Switch to English

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని తర్జనభర్జన పడుతోంది. మామూలుగా అయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి దూరం చేసేందుకు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు తమ ఎమ్మెల్యేలు లొంగకుండా చూసుకోవాల్సిక క్లిష్ట బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబుపై పడింది.

ఇప్పటికే బాబు ప్రతిపక్ష హోదాకు గండి కొట్టే దిశగా అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టి ముందుకెళుతోంది. ఇందులో భాగంగా చాలానెలల క్రితమే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలని ఆ పార్టీ వీడేలా చేసింది. తాజాగా ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ కూడా టీడీపీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడుకు వీరిద్దరూ హాజరు కాలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మహానాడులో పాల్గొనలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే.. ఎమ్మెల్యే గొట్టిపాటి రవితోపాటు విశాఖకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సన్నద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండి పడినట్టే. దీంతో బాబు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. తన ప్రతిపక్ష హోదాతోపాటు పార్టీని కాపాడుకోవడానికి వ్యూహం సిద్ధం చేశారని సమాచారం.

అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు వెదజల్లి, మంత్రి పదవులు ఎరవేసి వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తన వైపు తిప్పుకున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల విషయంలోనూ అనుసరించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

పార్టీని వీడకుండా ఉంటే ఒనగూరే ప్రయోజనాలు చెప్పడంతోపాటు ఆర్థికంగా ఎంత లబ్ధి చేకూరుతుందో వివరించినట్టు చెబుతున్నారు. మండలి రద్దు సందర్భంగా పార్టీ ఎమ్మెల్సీలు అధికార పార్టీ వైపు వెళ్లకుండా చూసేందుకు బాబు ఇదే వ్యూహం అనుసరించారు. మండలి రద్దయినా సరే.. ఎమ్మెల్సీల జీతభత్యాలకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటామని భరోసా ఇవ్వడంతో ఎవరూ అధికార పార్టీ వైపు వెళ్లలేదు.

దీంతో అక్కడ విజయవంతమైన ఈ వ్యూహాన్ని ఎమ్మెల్యేలకూ వర్తింపజేయాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సిందే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

ఎక్కువ చదివినవి

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...