రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ముఖచిత్రం పూర్తిగా మారేలా పల్లె పండగ 2.0 ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో పల్లె పండగ 2.0 కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. గత పల్లె పండగ విజయాన్ని కొనసాగించేలా ఈసారి ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైన్లు, శానిటేషన్ పనులపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ, ఇంజనీరింగ్ చీఫ్ బాలు నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
