జగన్ పాలనలోనే 50% మెడికల్‌ సీట్లు ప్రైవేటుకు కేటాయించారు: పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,402FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు సమాధానంగా పల్లా పలు వాస్తవాలను వివరించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు, సీట్ల కేటాయింపులు, పీపీపీ విధానం వంటి అంశాలపై జగన్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాలను పల్లా గుర్తు చేశారు.

“ప్రస్తుత వైసీపీ నేతలు పీపీపీ విధానం పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ నిజం ఏమిటంటే, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 50 శాతం సీట్లు ప్రైవేట్‌ కోటాకు కేటాయించినది జగన్‌ ప్రభుత్వమే” అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, జీ.ఓ. నంబర్లు 107, 108, 133లను విడుదల చేసి ప్రైవేట్‌ కోటా సీట్లను ఏర్పాటు చేసింది జగన్‌ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర నిధులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని పల్లా పేర్కొన్నారు. నిర్మాణాలకు ఖర్చయిన రూ.1550 కోట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులేనని చెప్పారు. నాలుగేళ్ల జగన్‌ పాలనలో 18 శాతం మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయని, ఈ రేటుతో ముందుకు సాగితే 17 కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని వివరించారు.

జగన్‌ ప్రభుత్వ విధానం వల్ల 1750 మెడికల్‌ సీట్లు మరియు అనేక పీజీ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని పల్లా హెచ్చరించారు. కానీ పీపీపీ విధానం అమలులోకి వస్తే ప్రభుత్వ కోటాలో 110 సీట్లు, ప్రైవేట్‌ కోటాలో మరో 110 సీట్లు పెరిగి మొత్తం 220 సీట్లు విద్యార్థులకు అదనంగా లభిస్తాయని చెప్పారు. పీపీపీ పద్ధతిలో కూడా ఇప్పటిలాగే 50 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలోనే భర్తీ అవుతాయని, ప్రభుత్వ ఫీజులు మాత్రమే వర్తిస్తాయని వివరించారు.

రాబోయే రెండేళ్లలో పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాలు పూర్తి అవుతాయని, విద్యార్థులు త్వరగా లాభపడతారని పల్లా చెప్పారు. కర్నాటకలో ఇప్పటికే 12 కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణంలో ఉన్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు.

జగన్‌ పాలనలో గంగవరం పోర్ట్‌, విశాఖ స్టీల్‌ భూములు ప్రైవేటుకు అమ్మేసినదీ జగన్‌ ప్రభుత్వమేనని పల్లా ఆరోపించారు. “జగన్‌ విధ్వంస పాలన వల్ల నిధుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం నిధులు మెడికల్‌ కాలేజీలకే ఖర్చు చేస్తే సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు, రోడ్లు అన్నీ దెబ్బతింటాయి. ఇది జగన్‌ రాజకీయ కుట్ర” అని పల్లా లేఖలో పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనలో జిల్లాకొక మెడికల్‌ కాలేజీ, రెవిన్యూ డివిజన్‌కొక ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేసినందునే నేడు రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా ఉందని పల్లా చెప్పారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నలుగురు ఎన్‌.ఆర్‌.ఐల్లో ఒకరు తెలుగువారిగా ఉన్నారంటే, అది చంద్రబాబు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల ఫలితం” అన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 18 ప్రభుత్వ, 18 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయంటే అది చంద్రబాబు హైబ్రిడ్‌ విధానానికి ఫలితమని పేర్కొన్నారు. చైనా, వియత్నాం వంటి దేశాలు హైబ్రిడ్‌ విధానం వల్ల అభివృద్ధి చెందగా, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాలు పిడివాదం వల్ల వెనకబడ్డాయని ఆయన ఉదాహరణ ఇచ్చారు.

పల్లా శ్రీనివాసరావు తన లేఖలో— “మెడికల్‌ కాలేజీల పేరుతో జగన్‌ చేస్తున్నది ప్రజల ప్రయోజనాల కోసం కాదు, రాజకీయ స్వార్థ ప్రయోజనాలకోసమే” అని విమర్శించారు. నీతి ఆయోగ్‌ రిపోర్టు ప్రకారం 2014–19లో చంద్రబాబు పాలనలో ఏపీ ఆరోగ్య రంగం 4వ స్థానంలో ఉండగా, 2019–24లో జగన్‌ పాలనలో 10వ స్థానానికి పడిపోయిందని తెలిపారు.

“చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీని నిర్మించలేదని జగన్‌ చెప్పడం పచ్చి అబద్ధం. చంద్రబాబు, ఎన్టీఆర్‌ పాలనల్లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో 28 మెడికల్‌ కాలేజీలు స్థాపించబడ్డాయి. ఆ కాలేజీలు ఇవాళ ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాయి. చంద్రబాబు లక్ష్యం హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే” అని పల్లా లేఖలో పేర్కొన్నారు.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.. వివరాలివే

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత...

‘రాకాస’తో థియేటర్‌లో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్: నిహారిక కొణిదెల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 2024లో భారీ విజయాన్ని అందుకుని అనేక అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో,...

లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ వైభవంలో పాల్గొన్న లోకేష్ దంపతులు

మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దేవస్థానం ఉత్సవ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో...

తనూజపై ఆరోపణలు… గట్టిగా స్పందించిన బిగ్ బాస్ రన్నరప్

బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తుండగా, నటుడు పవన్ సాయి విడాకుల వ్యవహారాన్ని ఆమెతో లింక్ చేస్తూ కొన్ని విమర్శలు...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...