ఈ కరోనా కష్టకాలంలో ఎన్నో విధాలుగా నష్టాలను ఎదుర్కుంటున్న పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. థియేటర్లు మూతపడి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టబోతుంటే చిత్రీకరణలు లేక చిన్న స్థాయి నటీనటులు, రోజు వారీ కార్మికులు భారంగా బ్రతుకీడుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు పూర్తయిన తమ చిత్రాలను థియేటర్ రిలీజ్ కోసం వేచి చూడకుండా ఆన్లైన్ స్ట్రీమింగ్ వేదికలపై విడుదల చేస్తున్నారు.
గత నెలలో కాలంలో తెలుగు చిత్రం ‘అమృతారామమ్’ నేరుగా ఒటీటీ ప్లాట్ ఫాం ‘జీ5’ వేదికగా విడుదల కాగా తాజాగా ఈరోజు తమిళ చిత్రం ‘పొన్మగళ్ వందాళ్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలయింది. ఓటీటీ వేదికలపై సినిమాలను విడుదల చేసేందుకు ఇతర భాషల కంటే బాలీవుడ్ నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ కోవలో మరో ఓటీటీ సంస్థ ‘డిస్నీ సంయుక్త హాట్ స్టార్’ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంపై కన్నేసారు. ఈ చిత్రాన్ని నేరుగా వెబ్ రిలీజ్ చేయటానికి మేకర్స్ కు రూ.120 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసారని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం కానీ, ఓటీటీ సంస్థ కానీ ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనలూ చేయలేదు.
తమిళ చిత్రం ‘కాంచన’కు రీమేక్ గా తెరకెక్కిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా మే 22న విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితులు, మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కేప్ గుడ్ ఫిలిమ్స్ మరియు తుషార్ ఎంటర్టైన్మెంట్ మరియు షబీనా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో తుషార్ కపూర్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రల్లో నటించారు.
ఒకవేళ బాంబు లాంటి ఈ భారీ డీల్ కానీ కుదిరితే పాన్ ఇండియా సినిమాల పేరుతో భారీగా బడ్జెట్ పెడుతున్న నిర్మాతలకు తమ సినిమాలను మంచి ధరకు విడుదల చేసేందుకు మార్గం దొరికినట్లవుతుంది.
157442 543492Its fantastic as your other posts : D, appreciate it for putting up. 95524
726593 724654I got what you intend, saved to fav, quite nice site . 995230
797268 915253great points altogether, you just gained a emblem new reader. 691773
943255 94706I was reading through some of your content on this internet web site and I believe this website is truly instructive! Keep putting up. 976547