అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా తీర్పును ఇచ్చి కొత్త చర్చకు తెర లేపింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి కోర్టు నుంచి ఊరట లభించింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ అచ్చుత్ కుమార్ అనే వ్యక్తిపై 19 ఏళ్ల బాలిక ఆరోపించింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో గతేడాది నవంబర్ లో ఫిర్యాదు చేసింది. తనకు గర్భం రాకుండా కూడా బలవంతంగా టాబ్లెట్స్ వాడించాడని కూడా తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అచ్యుత్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అచ్యుత్ కింది కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతని బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు.
దీంతో కేసును పూర్తిగా స్టడీ చేసిన హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ‘పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఓ మహిళ ఇష్టపడి శారీరక సంబంధం పెట్టకుంటే దానిని అత్యాచారం కింద పరిగణించలేమని పేర్కొంది. ఇది సన్నిహిత సంబంధం కింద పరిగణించాల్సిందే కానీ అత్యాచర చట్టాలను ఉపయోగించి నేరంగా పరిగణించలేము’ అని జస్టిస్ ఎస్ కే పాణిగ్రాహి తన తీర్పులో పేర్కొన్నారు.
750018 252896But yet another intelligent weblog! Completely cannot wait for a lot far more! 415966