2018 మే నెలలో గోదావరి నదిలో ఓ బోటు మునిగిపోయింది. అప్పట్లో ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేసింది. అప్పటి ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి విరుచుకుపడ్డారు. ఏకంగా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆ ఘటనను ప్రభుత్వ వైఫల్యంగా వైఎస్ జగన్ అభివర్ణించారు. కానీ, మళ్ళీ ఇంకో ఘటన జరిగింది.
ఈసారి వైఎస్ జగన్ హయాంలో బోటు మునిగింది. గత ఏడాది ఘటన తర్వాత చాలా మార్గదర్శకాలు రూపొందాయి. వాటిని, కొత్త ప్రభుత్వం పక్కన పెట్టినట్లే కన్పిస్తోంది. గతంలో బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా డిమాండ్ చేసిన వైఎస్ జగన్, తన హయాంలో జరిగిన పడవ మునక ప్రమాదంలో బాధితులకు మాత్రం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా, పోయిన ప్రాణాలైతే తిరిగిరావు. కానీ, ఈ ప్రమాదాలకు ఫుల్స్టాప్ పడాలి కదా.! అలా ఫుల్స్టాప్ పడాలంటే అధికారంలో వున్నవారికి చిత్తశుద్ధి వుండాలి. కానీ, అది పాలకుల నుంచి ఆశించలేకపోతున్నాం.
అప్పుడు వైసీపీ గగ్గోలు పెట్టింది.. ఇప్పుడు టీడీపీ గగ్గోలు పెడుతుంది. అప్పుడూ ప్రభుత్వ వైఫల్యమే.. ఇప్పుడూ ప్రభుత్వ వైఫల్యమే. ఈ విషయమై మీ అభిప్రాయాలు తెలపండి. బోటు మునకలో వైఎస్ జగన్ సర్కార్ వైఫల్యం వుందా.? లేదా.?
[poll id=”10″]
54902 809381HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 508014
132481 835754Wow, incredible weblog structure! How lengthy have you ever been blogging for? you made running a blog look easy. The full appear of your site is amazing, well the content material! 323854
135800 945969I like this weblog really considerably so much very good info . 49830