Firstname | |
---|---|
Movie Name | |
Star Cast | |
Director | |
Producer | |
Run Time | |
Release Date |
[poll id=”7″]
ముఖ్యమంత్రిగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ వంద రోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన అతి పెద్ద ఘనకార్యం ప్రజా వేదికను కూల్చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలకు సంబంధించిన భవనాలు ‘అక్రమ కట్టడాలు’ పేరుతో కూల్చేయడం మినహా, రాష్ట్ర ప్రజల కోసం ఓ కొత్త నిర్మాణం కూడా ప్రారంభిచంలేదనే విమర్శలున్నాయి.
అమరావతిని అయోమయంలోకి నెట్టేసి.. పోలవరం ప్రాజెక్టుని పాతాళంలోకి తొక్కేశారన్న విమర్శలు కోకొల్లలు. సంక్షేమ పథకాల్ని భారీగా ప్రకటిస్తూ, అమలుకు ఆదేశించేస్తున్నా, అభివృద్ధి మాత్రం కానరావడంలేదు. ఇంతకీ, వైఎస్ జగన్ 100 రోజుల పాలనపై మీ అభిప్రాయమేంటి.? రాష్ట్రానికి జగన్ పాలనతో ఒరిగింది ఏమైనా వుందా.?
బీజేపీ చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనా.? అధికార పార్టీ నేతలపై కేసులు నీరుగారిపోతున్నాయ్.. విపక్షాలకు చెందిన నేతలపై కేసులు పెరిగిపోతున్నాయ్. రాజకీయ కక్ష సాధింపుల కోసమే ముఖ్యమంత్రి పదవి అన్నట్లు వైఎస్ జగన్, తనకు దక్కిన పదవిని దుర్వినియోగం చేస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.? మీ అభిప్రాయాల్ని ఇక్కడ పంచుకోండి.