‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.?
ఈవీఎం ట్యాంపరింగ్ మీద మొదటి నుంచీ అనుమానాలున్నమాట వాస్తవం. గతంలో వైసీపీ గెలిచినప్పుడూ ఇవే అనుమానాలు వచ్చాయి. అంతకు ముందు, 2014 ఎన్నికల్లోనూ ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు అర్థం లేనివని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వస్తోంది.
అప్పట్లో వైసీపీని గెలిపించిన ఈవీఎంలు, ఇప్పుడు కూటమిని గెలిపించాయి. సో, ఇక్కడ ఈవీఎంలపై నిందలు వేయడంలో అర్థమే లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేదానికి ఆస్కారముంటే, బీజేపీ, ఇప్పుడు కూటమిగా కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా.?
ఇక, ప్రజలు మోసం చేయడం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రాజకీయ స్వామ్యంలో ఎప్పుడూ మోసపోయేది ప్రజలే.! రాజకీయ నాయకులు కాదు.! పేదవాడు దశాబ్దాలుగా పేదరికంలోనే మగ్గుతున్నాడు. వార్డు మెంబర్ కూడా కోట్లకు పడగలెత్తుతున్న రాజకీయాన్ని చూస్తున్నాం.
మద్యపాన నిషేధం విషయంలో మోసం చేసి, రాజధాని విషయంలో మోసం చేసి.. ఇలా రకరకాలుగా ప్రజల్ని వైసీపీ మోసం చేసింది. ఆ మోసాల్ని సహించలేక, ప్రజలు ఎదురుతిరిగారు.! ‘సంక్షేమం అంటే, ఎవడమ్మా రంకు మొగుడి సొమ్ము కాదు.. అది మా హక్కు..’ అన్న మాట, గ్రామ స్థాయిలో చాలా పచ్చిగా, ప్రజల నుంచి ఎన్నికల సమయంలో వినిపించింది. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ ప్రజల ఆలోచన ఇదే.
క్షమించాలి, ఇది సగటు ప్రజల ఆవేదన. వారి ఆవేదన వారి మాటల్లోనే వెల్లడించాల్సి వచ్చింది.
రోడ్ల మీద గుంతలు, అభివృద్ధి జరగకపోవడం.. వాట్ నాట్.. వైసీపీ ఓటమికి వంద, వెయ్యి కాదు.. లక్ష కారణాల్ని జనమే చెబుతున్నారు. దాన్ని వైసీపీ గుర్తించలేకపోయింది. ఇప్పటికీ ప్రజా నాడిని వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది.!