విశాఖను గ్యాస్ లీకేజీలు వదలడం లేదు. తాజాగా మరో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపుతోంది. విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీక్ అయింది. సాయినార్ ఆఫ్ సైన్సెస్ కంపెనీలో గ్యాస్ లీక్, ఇద్దరు మృతి చెందారు. నలుగురికి అస్వస్థత కలగగా వారని ఆస్పత్రికి తరలించారు.
సాయినార్ ఆఫ్ సైన్సెస్ లోని మృతులు షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, గౌరీశంకర్గా గుర్తించారు. అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, ఆనంద్బాబు, జానకిరామ్, సూర్యనారాయణ, హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
కంపెనీలో లీకైన గ్యాస్ బెంజిమెడిజోల్ వేపర్గా గుర్తించారు. ఎల్జీ పాలిమర్స్ లో ఈమధ్యే స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు విశాఖ కలెక్టర్, సీపీ, ఏడీసీపీ. పరిస్థితిని ఆరా తీసిన కలెక్టర్ వినయ్చంద్. గ్యాస్ లీక్ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీచేశారు.
344839 322897Thank you for your style connected with motive though this information is certain location a new damper within the sale with tinfoil hats. 229777
828862 142690I truly enjoyed your amazing internet site. Be sure to keep it up. May god bless you !!!! 982554