దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ కు సంబంధించి భారీగా సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది. గత మూడు రోజులుగా రోజుకు 8వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో ఏకంగా 8,171 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు సమీపించింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,99,757కి చేరింది. 50వేల నుంచి లక్ష కేసులు కావడానికి 13 రోజుల సమయం పట్టగా.. లక్ష నుంచి రెండు లక్షల కేసులు కావడానికి 14 రోజుల సమయం పట్టింది. కేసులు రెట్టింపు అయ్యే సమయం ఒకేవిధంగా సాగుతోంది.
ప్రస్తుతం 18.59 లక్షల కేసులతో అమెరికా తొలి స్థానం ఉండగా.. బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ తర్వాత భారత్ ఏడో స్థానంలో ఉంది. అదే సమయంలో మనదేశంలో మరణాల రేటు తగ్గడం, రికవరీ రేటు పెరగడం కాస్త ఊరటనిస్తోంది. 45 రోజుల క్రితం 3.3 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.83 శాతానికి తగ్గింది. అలాగే రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరుతోంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,608 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 96వేల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో దాదాపు 71వేల కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఇక ఏపీలో గత 24 గంటల్లో 115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
755400 378189youve gotten an crucial weblog right here! would you wish to make some invite posts on my weblog? 45250