వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నామధ్యన సత్తెనపల్లి వెళ్ళారు. అక్కడ ఓ పెద్దాయనని వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. కారు కింద పడ్డాడు ఆ పెద్దాయన. కారు చక్రం కింద ఆ పెద్దాయన తలకాయ నలిగిపోయింది.. నలిగిపోవడమంటే, రోడ్డుకి రాసుకుంటూ పోయింది.
రోడ్డుకీ కారు చక్రానికీ మధ్య రాసుకుంటూ పోయిన ఆ పెద్దాయన తలకాయ.. వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. రాష్ట్రాన్ని కుదిపేసింది ఈ ఘటన. ఆ పెద్దాయన దురదృష్టవశాత్తూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. అసలు ఆ పెద్దాయన వైఎస్ జగన్ కారు కింద పడలేదని తొలుత ఓ పోలీస్ ఉన్నతాధికారి తొందరపాటు ప్రకటన చేసినా, ఆ తర్వాత తప్పుని సరిదిద్దుకున్నారు.
కేసు నమోదైంది, ఈ కేసులో కారు డ్రైవర్ అరెస్టయ్యాడు. ఇదే కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో నిందితుడిగా వున్నారు. ఓ పార్టీ అధినేత, పైగా, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే.. ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.?
బాధిత కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని, పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి, చేతులు దులిపేసుకున్నారు వైఎస్ జగన్. అదేంటీ, కేసు నమోదై.. విచారణ దశలో వున్నప్పుడు, నిందితుడిగా వున్న వైఎస్ జగన్ ఎలా బాధిత కుటుంబాన్ని తన వద్దకు రప్పించుకుంటారు? ఇదో మిస్టరీ.
తాజాగా, జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈసారి జగన్ పర్యటన సందర్భంగా మామిడికాయలు నలిగిపోయాయి, చక్రాల కింద. అయితే, ఆ చక్రాలు ట్రాక్టరువి. ముందే, ప్లాన్ చేసుకుని.. రెండు ట్రాక్టర్ల లోడ్ మామిడికాయల్ని తీసుకొచ్చి, రోడ్డు మీద పారేయించి, వాటిని ట్రాక్టర్లతో తొక్కించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి, వైసీపీ బండారాన్ని బయటపెట్టారు. తలకాయతో పోల్చితే, మామిడికాయల వల్ల ప్రాణ నష్టమైతే లేదు. అక్కడికి సంతోషపడాల్సిందే. కానీ, ఇదేం తొక్కుడు పైత్యం.?
మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెంనాయుడు.. సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ, వైసీపీ తొక్కుడు విధానాన్ని ఎండగట్టారు.
జగన్ కుట్ర బయట పెట్టిన డ్రోన్ వీడియో..
జగన్ వచ్చే సమయానికి తోటల్లోంచి, మామిడి లోడ్ తో ఉన్న ట్రాక్టర్లు బయటతెచ్చి, రోడ్డు పై పారబోసి డ్రామా. ఇదీ వైసీపీ ఈవెంట్ పాలిటిక్స్ ప్లాన్.ఈ ఈవెంట్ లో పాత్రధారాలు :
ఆ తోట – ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తిది, అతను చిత్తూరు వైసీపీ సెక్రటరీ
ఆ… pic.twitter.com/VG7GpVLsl6— Telugu Desam Party (@JaiTDP) July 9, 2025
