‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు. ఆ సింపతీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాగా కలిసొచ్చింది. వైఎస్ జగన్ జైలుకు వెళ్ళడం, ఈ క్రమంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడం, వైఎస్ జగన్ కోసం జైలు వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, భారతి.. ఇలా రోడ్డు మీదనే కూర్చోవడం.. ఇవన్నీ అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఈ సింపతీనే కారణం. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్..’ అంటూ 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అభ్యర్థించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇందుకాయనకు ప్రజా సంకల్ప యాత్ర బాగా ఉపయోగపడింది.
మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సింపతీ అవసరమైంది. అధికార పీఠమెక్కి, రాజకీయ ప్రత్యర్థుల్ని అక్రమ కేసులతో ఓ వైపు వెంటాడుతూనే, ‘నేను అమాయకుడ్ని.. నా మీద అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు..’ అంటూ విపక్షాల మీదా, మీడియా మీద సైతం ఆయన నిందారోపణలు చేస్తున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ వ్యవస్థ సహా వివిధ వ్యవస్థల్ని వైఎస్ జగన్ ఎలా ఉపయోగించుకుంటున్నారో గత మూడేళ్ళుగా చూస్తూనే వున్నాం. రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియదు.. ప్రత్యేక హోదా రాదు, రైల్వే జోన్ హుళక్కయ్యేలా వుంది.. పోలవరం ప్రాజెక్టు పరిస్థితీ అయోమయమే.. ఇన్ని కీలక అంశాలు వుండగా, ‘దుష్ట చతుష్టయం.. నన్ను ఒంటరిని చేసి వేధిస్తోంది..’ అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు ఓటర్ల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
టీడీపీ నిర్వీర్యమైపోయిందనే భావన ఓ వైపు వైసీపీ వ్యక్తం చేస్తూనే, ఇంకోపక్క ఆ టీడీపీ కుట్రలు చేస్తోందనడం ఎంతవరకు సబబు.? చంద్రబాబు సతీమణిపైనా, చంద్రబాబు కోడలిపైనా వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద జుగుప్సాకరమైన నిందారోపణలు చేస్తున్నది వైసీపీ, వైసీపీ అను‘కుల’ మీడియానే.
నిజానికి, వైసీపీ అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ళపాటు టీడీపీ అనుకూల మీడియాగా చెప్పబడే ఈనాడు కొంత సంయమనం పాటించింది. కానీ, ఆ ఈనాడునీ వైఎస్ జగన్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో, ఈనాడులో వైఎస్ జగన్ టార్గెట్గా కథనాలు మరింత ఘాటుగా షురూ అయ్యాయ్. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కూడా.!
వైఎస్ జగన్ సింపతీ కోరుకుంటున్నారు.. రాష్ట్ర ప్రజల్ని ఆ సింపతీ వేవ్లో బలి చేస్తున్నారు. రాష్ట్రమే నష్టపోయింది గడచిన మూడేళ్ళలో. ఏదీ రాజధాని.? అంటే ముఖ్యమంత్రి ఇప్పటికైనా సమాధానం చెప్పగలరా.?
171435 685888I was trying to find this. Truly refreshing take on the information. Thanks a good deal. 452085
195704 509363The the next time I just read a weblog, I truly hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I genuinely thought youd have some thing intriguing to say. All I hear is typically a couple of whining about something that you could fix when you werent too busy searching for attention. 488554
122982 232529Some genuinely nice and utilitarian information on this website, as properly I believe the style has got fantastic features. 509820