పార్టీ మారే ఆలోచనల్ని పక్కన పెట్టి, పార్టీకి పూర్వ వైభవం తెచ్చే దిశగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యోన్ముఖుడవుతున్నారట. కొన్నాళ్ళ క్రితం వైసీపీతో సంప్రదింపులు జరిపిన గంటా శ్రీనివాసరావు, మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డం పడ్డంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్న విషయం విదితమే. ఆ తర్వాత బీజేపీలో వెళ్ళేందుకూ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ, చివరి నిమిషంలో గంటా శ్రీనివాసరావు తన ఆలోచనల్ని మార్చుకోవాల్సి వచ్చింది.
తాజాగా బీజేపీ నుంచి కొందరు కార్యకర్తల్ని టీడీపీలోకి లాక్కురాగలిగారు గంటా శ్రీనివాసరావు. అలా అధినేత చంద్రబాబు మెప్పుని పొందేందుకు గంటా శ్రీనివాసరావు వేసిన స్కెచ్ బాగానే పనిచేసినట్లుంది. గంటా శ్రీనివాసరావుకి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేలా చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారట పార్టీ ముఖ్య నేతలతో. అయితే, దీన్ని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో అచ్చెన్నాయుడు, టీడీపీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన మాట వాస్తవం. ఉత్తరాంధ్రకు చెందిన అచ్చెన్నాయుడికి, పార్టీలో కీలక ప్రాధాన్యత కల్పిస్తున్నారు చంద్రబాబు. అయితే, గంటా తిరిగి యాక్టివ్ అయితే.. పార్టీలో గంటా వర్సెస్ అచ్చెన్నాయుడు.. వెరసి కొత్త ఆధిపత్య పోరు షురూ అవుతుందనే చర్చ పార్టీలోనే జరుగుతోంది.
అచ్చెన్నాయుడితో పోల్చితే గంటా శ్రీనివాసరావుకి ‘ఎక్స్ట్రా క్వాలిటీస్’ వున్నాయి. అన్ని రాజకీయ పార్టీల్లోనూ గంటా శ్రీనివాసరావుకి సన్నిహిత సంబంధాలున్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న సమయంలో గంటా శ్రీనివాసరావు తనదైన స్టయిల్లో చక్రం తిప్పగలరు.. అది పార్టీకి కలిసొస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. మరి, అచ్చెన్నాయుడిని కాదని గంటాకి చంద్రబాబు కీలక పదవులు ఇవ్వడమా.? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకడంలేదు.
530001 270253There is clearly a great deal to know about this. I think you made various good points in attributes also. 454960
159822 808504Thank you for sharing with us, I believe this site truly stands out : D. 154775
365791 845504I gotta favorite this web site it seems extremely beneficial . 988072