కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా మెడికల్ సిబ్బందిలో ఓ ఉద్యోగికి ఇబ్బంది వస్తే ఆదుకునేవారే కరువయ్యారు. సాక్షాత్తూ వారి సహోద్యోగులే పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. కరోనా వైరస్ కు ప్రజలు ఏస్థాయిలో భయపడుతున్నారో అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది.
కరోనా రోగులను చికిత్స అందించేందుకు జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి బుందేల్ ఖండ్ లోని మెడికల్ కాలేజీకి తరలించారు కొంతమంది పారా మెడికల్ సిబ్బంది. అనంతరం తిరిగి ఆస్పత్రికి బయలుదేరింది ఆ బృందం. ఇంతలో వారి బృందంలోని ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే వారి సహోద్యోగినే కాపాడాల్సిన సిబ్బంది పట్టించుకోలేదు. ఆ సమయంలో వీరంతా పీపీఈ కిట్లలోనే ఉన్నారు. అయినా వారు పట్టించుకోకుండా అతడిని రోడ్డుపై అలానే వదిలేసి వెళ్లిపోయారు.
దాదాపు అరగంట సేపు ఆ వ్యక్తి రోడ్డుపై అచేతనంగా పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసిన స్థానికులు కానీ.. అటువైపుగా వెళ్లిన వారు కానీ అతడిని పట్టించుకోలేదు. ఈ సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. అతడిని రక్షించి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. తోటి సిబ్బంది చేసిన పనికి సర్వత్రా వ్యతిరేకత వస్తోంది.
299928 762319Some genuinely fantastic information , Gladiola I identified this. 938117