Switch to English

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,180FansLike
57,764FollowersFollow


తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా NTV ఇన్ పుట్  ఎడిటర్ దొంతు రమేష్‌తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా అరెస్ట్ చూపకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఐదు రోజుల క్రితం NTVలో ప్రసారమైన ఈ వార్తపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో, నిన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో న్యాయసలహాదారుల సూచన మేరకు నిన్న సాయంత్రం NTV యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ కూడా కోరింది. దీంతో విషయం అక్కడితో ముగుస్తుందని చాలామంది భావించారు.

అయితే, అనూహ్యంగా ఘటన మరో మలుపు తిరిగింది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న NTV ఇన్ పుట్  ఎడిటర్ దొంతు రమేష్‌ను పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఎక్కడ ఉంచారన్న విషయాన్ని పోలీసులు స్పష్టంగా వెల్లడించకపోవడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.

ఇవాళ వీరిని నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేలా పోలీసులు ప్లాన్ చేస్తున్నారని ఛానల్ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై మీడియా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండగా, జర్నలిస్టులపై తీసుకుంటున్న చర్యలు సముచితమా కాదా అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం వాదిస్తుండగా, మరోవైపు ఇది మీడియాను భయపెట్టే ప్రయత్నమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసు ఎలా మలుపులు తిరుగుతుందో, న్యాయస్థానం ముందు ఏ నిర్ణయం వెలువడుతుందో చూడాల్సి ఉంది.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

అంబటి వ్యాఖ్యలపై మండలిలో మంత్రి లోకేష్ ఫైర్

అమరావతి: శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి...

‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్‌తో హార్ట్ టచ్ చేసిన కొత్త ప్రేమకథ

శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ గ్లింప్స్ విడుదలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా...

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...

రెండు గంటల నాన్‌స్టాప్ నవ్వుల హామీ.. ‘ఫంకీ’ టీమ్ విశ్వాసం

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్...

‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ ఫిబ్రవరి 13న వరల్డ్‌వైడ్ రిలీజ్

తెలుగు వారు నిర్మించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఎ బ్యూటిఫుల్ బ్రేకప్’ ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. తక్ష్, మటిల్డా బాజర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం...