Switch to English

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర సంగతి సరే సరి. తెలంగాణ విషయానికొస్తే, గ్రేటర్‌ హైద్రాబాద్‌ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కరోనా దాదాపుగా అదుపులోకి వచ్చేసింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఒకటీ అరా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు కొంత ఆందోళనకరంగానే వున్నా, దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైద్రాబాద్‌ చాలా బెటర్‌.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగానే వుంటోంది చాలా కాలంగా. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణా పునఃప్రారంభమయన దరిమిలా.. రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ముందు ముందు ఎలా వుండబోతోందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్పÛలితాలిస్తున్నాయనీ, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దేశంలోని చాలా ఇతర రాష్ట్రాలతో పోల్చితే కాస్త మెరుగ్గానే వుందని కేంద్రం కూడా చెబుతుండడం గమనార్హం. అయితే, తెలంగాణలో టెస్ట్‌ల సంఖ్య తక్కువగా వుండడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య విషయమై గందరగోళం నెలకొందన్న రాజకీయ విమర్శల్ని చూస్తున్నాం. రాజకీయ రగడ సంగతి పక్కన పెడితే.. రానున్న రోజుల్లో కరోనా, తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టి, పూర్తిగా అదుపులోకి వచ్చేలానే కన్పిస్తోంది. ఇదిలా వుంటే, దేశంలోని ప్రధాన నగరాల మధ్య విమానయానం షురూ కానున్న దరిమిలా.. కరోనా వైరస్‌ కేసులు పెరిగే అవకాశముందనీ, తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుదల వుండొచ్చన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.

ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నామంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కొంత భరోసా ఇచ్చేలానే వున్నా, కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సృష్టించిన భయాందోళనల నేపథ్యంలో.. ప్రజలు మాత్రం ముందు ముందు ఇంకెలాంటి ఉపద్రవం చూడాల్సి వస్తుందోనన్న ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఇక, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల విషయానికొస్తే, నాలుగైదు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య లక్షన్నర దాటే అవకాశం వుంది. గత రెండు మూడు రోజులుగా సగటున రోజుకి 6 వేల పైన కేసులు నమోదవుతున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...