జనసేనాని ‘సీమ’ దెబ్బ.. వైసీపీకి గట్టిగానే తగిలిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

మూడు రాజధానుల ఆలోచన వెనుక రాజకీయం సుస్పష్టం. మూడు ప్రాంతాల్లో రాజకీయ అలజడులు సృష్టించడం, తద్వారా రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవడం అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. లేకపోతే, దేశంలో ఎక్కడా లేని మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలనుకోవడమేంటి.?

ఆర్థికంగా అత్యున్నత స్థానంలో వున్న రాష్ట్రాలు ఇలాంటి ఆలోచన చేస్తే దాన్ని తప్పు పట్టలేం. ఒకే ఒక్క రాజధానిని నిర్మించుకోలేని ఆర్థిక దుస్థితి ఆంధ్రప్రదేశ్‌ది. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ఆలోచన అత్యంత ప్రమాదకరమైనదేనని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నా జగన్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు.

ఇదిలా వుంటే, జగన్‌ వ్యూహానికి జనసేనాని కర్నూలు పర్యటనతో పెద్ద దెబ్బ తగిలినట్లే కన్పిస్తోంది. మూడు రాజధానుల ఎఫెక్ట్‌, జనసేనాని కర్నూలు పర్యటనపై ఎక్కడా పడలేదు. ఓ పది మంది గుమికూడి, ‘పెయిడ్‌ రచ్చ’ అయితే జనసేనానికి వ్యతిరేకంగా చేయగలిగారుగానీ.. వారి ‘గోల’, జనసైన్యం హోరు ముందు ఎక్కడా విన్పించలేదు.

ఇక, కర్నూలులో స్థానికంగా వున్న సమస్యల్ని జనసేనాని ప్రస్తావించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏళ్ళ తరబడి నిర్మాణానికి నోచుకోని ఓ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డు తగులుతున్న రాజకీయ వివాదాలు.. వీటన్నిటినీ ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన పర్యటనలో ఎలుగెత్తి చాటారు. ‘ముందు, ఈ సమస్యల్ని పరిష్కరించండి.. ఆ తర్వాత మూడు కాదు, 30 రాజధానులు కడతామని చెప్పండి..’ అంటూ జనసేనాని ఎద్దేవా చేస్తున్నారు.

నిజమే, ఎప్పుడైతే ప్రజల సమస్యల్ని ఏ నాయకుడైనా ప్రస్తావిస్తాడో.. అప్పుడు, ఆటోమేటిక్‌గా ఆయా అంశాల చుట్టూ చర్చ జరిగి తీరుతుంది. కర్నూలు ఒకప్పుడు రాజధాని కావాల్సిన నగరమే. కానీ, కాలేదు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ కర్నూలు అభివృద్ధి చెందలేదు. చంద్రబాబు హయాంలోనూ అదే పరిస్థితి. వైసీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలకుపైగానే అవుతోంది. కర్నూలు అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటి.?

రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని సరిపోతుంది. మిగతా నగరాలన్నిటినీ రాజధాని తరహాలో అభివృద్ధి చేస్తే చాలు. కానీ, అది చేతకాక.. ప్రజల్ని రెచ్చగొట్టే క్రమంలో, రాజకీయ పబ్బం గడుపుకోవడానికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వాస్తవం, జనసేనాని ‘సీమ’ పర్యటనతో మరోమారు బలంగా బయటకొచ్చింది. ఈ దెబ్బ అధికార వైఎస్సార్సీపీకి గట్టిగానే తగిలినట్లుంది. అందుకే, పార్టీ నేతలంతా మూకుమ్మడిగా జనసేనానిపై నోరు పారేసుకునేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు తప్ప.. కర్నూలు సమస్యలపైనా, సీమ సమస్యలపైనా ఎవరికీ గొంతు పెగలడంలేదు.

5 COMMENTS

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“‘రియాలిటీ’తో రాబోతున్న కిరణ్ అబ్బవరం… కొత్త కాన్సెప్ట్ సిగ్నల్?”

యువ హీరో కిరణ్ అబ్బవరం తన తదుపరి ప్రాజెక్ట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. టైటిల్ వినగానే సినిమా కథపై...

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

“హిట్స్ ఉంటేనే డిమాండ్.. శ్రీలీలకు ప్రస్తుతం చిన్న బ్రేక్?”

టాలీవుడ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఫలితాల మీదే ఆధారపడే ప్రపంచం. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్స్ ఉంటేనే డిమాండ్ పెరుగుతుంది. అందం, అభినయం, డాన్స్—అన్నీ కలగలిపిన ప్రతిభతో Sreeleela తక్కువ సమయంలోనే టాప్ చాయిస్...

పదవులు కాదు.. పనితీరే కీలకం: లోకేష్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల సందర్భంగా మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రస్తుతం టిడిపి 3.0 వర్షన్‌తో ముందుకెళ్తోందని, ఇకపై పైరవీలు కాదు.. పనితీరు,...